వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమా తో టాలీవుడ్ కి రకుల్ ప్రీత్ సింగ్ పరిచయమైన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో సందీప్ కిషన్ వంటి యంగ్ హీరోలతో సినిమాలు చేసింది. అయితే అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంది. వరుసగా బ్లాక్ బస్టర్స్ ను సాధించింది. అంతేకాదు గట్టిగా రెండేళ్ళు గడవక ముందే కోటి రెమ్యూనరేషన్ అందుకునే స్థాయికి చేరుకుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ ఇలా వరసగా స్టార్స్ తో సినిమాలు చేస్తూనే చిన్న హీరోలతో కమిట్ అయ్యి.. చక చకా సినిమాలు చేసేసింది. 

 

భారీ రెమ్యూనరేషన్ అందుకుంటూ చేతినిండా సినిమాలతో ఓ అయిదేళ్ళు రకుల్ ప్రీత్ క్షణం తీరిక లేకుండా సినిమాలతో కాలం గడిపింది. అయితే ఏమైందో గాని ఉన్నపలంగా వరుసగా ఫ్లాప్స్ పడి ఎవరూ ఊహించనంతగా డౌన్ ఫాల్ అయింది. అందుకు అసలు కారణం సరైన కథలను ఎంచుకోకపోవడం ఒకటైతే... స్టార్ హీరోలతో సినిమాలు కమిటవుతూనే చిన్న సినిమాలు ఒప్పుకోవడం ఇంకో కారణం. అయితే రకుల్ ప్రీత్ చేసిన తప్పు నేను ఏమాత్రం చెయ్యనని అంటోంది ప్రస్తుతం మంచి ఫాం లో ఉన్న కన్నడ బ్యూటి రష్మిక మందన్న.

 

ఈ ఏడాది ప్రారంభం లోనే మహేష్ తో నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో భారీ హిట్ కొట్టింది. ఆ తర్వాత రీసెంట్ గా యంగ్ హీరో నితిన్ నటించిన భీష్మ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దాంతో వరసగా స్టార్ హీరోల సినిమాలలో ఆఫర్స్ దక్కించుకుంటుంది. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం లో ఈ కన్నడ బ్యూటి నటుస్తుంది. ఇలా వరసగా సినిమాలు దక్కించుకుంటున్న రష్మిక రెమ్యూనరేషన్ కూడా డబుల్ చేసేసిందట.

 

అంతేకాదు ఇప్పటి నుంచి నితిన్, విజయ్ దేవరకొండ లాంటి సక్సస్ లో ఉన్న యంగ్ హీరోల తో పాటు స్టార్ హీరోల సినిమాలే కమిటవుతుందట. అంతేకాదు కథ నచ్చితేనే సినిమా ఒప్పుకుంటుందట గాని కాంప్రమైజ్ అయి మాత్రం ఒప్పుకోనని తెగేసి చేబుతుందట. ఏదేమైనా రష్మిక ప్లాన్స్ బాగానే ఉన్నాయి. మరి ఎంతకాలం టాలీవుడ్ లో కొనసాగుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: