మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ఒక ట్వీట్ డైరక్టర్ పూరి జగన్నాథ్ చెంప పగిలేలా చేసిందట. చిరు ట్విట్టర్ ఎంట్రీ ఇవ్వడం అందులో టాలీవుడ్ లో ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే వాళ్లందరితో ట్వీట్ సంభాషణలు చేయడం చూస్తూనే ఉన్నాం. ట్విట్టర్ లో చిరు ఎంట్రీ ఇచ్చాక ఆయనకు వెల్కమ్ చెబుటూ పూరి కూడా ట్వీట్ చేశాడు. అయితే పూరి మెసేజ్ కు రెస్పాండ్ అయినా చిరు నువ్వు బ్యాంకాక్ మిస్ అవుతున్నావ్ కదా అన్నట్టు కామెంట్ చేశాడు. అయితే అదే తన కొంపముంచింది అంటున్నారు పూరి. ఆ మెసేజ్ తన భార్య చూసి పాత జ్ఞాపకాలు గుర్తుతెచ్చుకుని నా చెంప పగలగొట్టిందని అన్నారు పూరి.

 

పూరి కొత్త సినిమా మొదలు పెట్టాడు అంటే బ్యాంకాక్ వెళ్లి రావాల్సిందే. అక్కడ ఒక నెల పాటు ఉంది కథ ఫినిష్ చేసుకుని వస్తాడు. తోడుగా ఎవరైనా ఫ్రెండ్ ను తీసుకెళ్తాడు. అయితే బ్యాంకాక్ వెళ్లి కథలు రాసినప్పటి నుండి పూరి డౌన్ ఫాల్ అవుతూ వచ్చాడు. స్క్రిప్ట్ బాగానే ఉన్నా అవి ఎందుకో వర్క్ అవుట్ కాలేదు. అందుకే పూరి బ్యాంకాక్ వెళ్లడం మానేశాడు. అందుకే పూరి గురించి చిరు బ్యాంకాక్ అనగానే పూరి వైఫ్ చెంప చెళ్లుమనిపించింది. ఈ విషయాన్ని పూరి స్వయంగా వెల్లడించడం విశేషం.  

 

కొన్నాళ్లుగా హిట్టు కోసం తపిస్తున్న పూరి ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సంచలన విజయం అందుకున్నాడు. రామ్ లోని ఎనర్జీని ఫుల్లుగా వాడేసిన పూరి ఆ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం పూరి రౌడీ హీరో విజయ్ దేవరకొండలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. సినిమాలో హీరోయిన్ గా అనన్యా పాండే నటిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: