మంచు విష్ణు తీవ్ర భావోద్వేగానికి గురి అవుతూ షేర్ చేసిన మెసేజ్ ఇప్పడు వైరల్ గా మారింది. విలయతాండవం చేస్తున్న కరోనా వైరస్ ధాటీకి అగ్రరాజ్యం అమెరికా చిగురు టాకులా వొణికి పోతోంది. రానున్న రోజులలో అమెరికాలో  కరోనా సమస్యల వల్ల వచ్చే మరణాలు లక్షల స్థాయిలో ఉంటాయి అని వస్తున్న వార్తలు అమెరికన్స్ కు నిద్రలేకుండా చేస్తోంది.   


వైద్య రంగంలో ప్రపంచ స్థాయిలో నెంబర్ వన్ గా కొనసాగే అమెరికా కూడ కరోనా తో యుద్ధం చేయలేకపోతోంది. కొన్ని లక్షల ట్రిలియన్ డాలర్స్ అమెరికాకరోనా యుద్ధం కోసం ఖర్చు పెడుతూ అక్కడ కూడ విపరీతమైన ఆంక్షలు పెట్టడంతో అమెరికాలో ప్రజలు అంతా తమ ఇళ్లకే పరిమితం అయిపోయారు. 


ఇలాంటి విపత్కర పరిస్థితుఅలో మంచు విష్ణు భార్యా పిల్లలు చిక్కుకోవడంతో విష్ణు తెగ టెన్షన్ పడుతున్నాడు. ఫిబ్రవరిలో మంచు విష్ణు భార్య దగ్గర చుట్టాలకు అమెరికాలో ఆపరేషన్ జరగడంతో వారిని చూడటానికి విష్ణు తన భార్య పిల్లలతో కలిసి అమెరికా వెళ్ళాడు. అయితే క్రితం నెల మోహన్ బాబు పుట్టినరోజు ఉండటంతో విష్ణు తన భార్య పిల్లలను అక్కడ వదిలి హైదరాబాద్ తిరిగి వచ్చాడు. 


అయితే అనుకోకుండా క్రితంనెల మధ్య నుండి కరోనా కష్టాలు పెరిగిపోవడం ఆ తరువాత కేంద్రప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో ప్రస్తుతం మంచు విష్ణు భార్య పిల్లలు చిక్కుకుపోయారు. ఈ విషయాలను తన అభిమానులకు వివరిస్తూ విష్ణు తన మనసు ఏమి బాగుండటం లేదని తెల్లవారితే చాలు తన భార్య పిల్లలు గుర్తుకు వస్తున్నారు అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. అంతేకాదు తన భార్య పిల్లలు ఎప్పుడు తిరిగి వస్తారో తనకే తెలియదు అంటూ బెంబేలెత్తి పోతున్నారు. దీనితో మంచు విష్ణు కష్టాలకు అతడి అభిమానులు కూడ ధైర్యం చెపుతూ ఏమి భయం అవసరంలేదు అంటూ మంచు విష్ణుకు భరోసా ఇస్తున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: