కరోనా సమస్యతో షూటింగ్ లకు గ్యాప్ ఏర్పడటంతో క్రేజీ బ్యూటీ రష్మిక బెంగుళూరులోని తన ఇంటిలో ఉంటూ స్కైప్ ద్వారా ఆన్ లైన్ లో దర్శకులు చెప్పే కథలు వినే కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రస్తుతం ఆమెకు బాగా ఖాళీ దొరకడంతో ఇంచుమించు ప్రతిరోజు తన డేట్స్ కావాలి అని అడుగుతున్న దర్శకులకు టైమ్ కేటాయిస్తూ రోజుకు ఒక కథ చొప్పున కథలు వింటూ కరోనా టైమ్ ను ఎంజాయ్ చేస్తోంది.


ఇలాంటి పరిస్థితులలో ఈమధ్య రష్మిక కు కథ చెప్పడానికి ప్రయత్నించిన ఒక టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ కు ఊహించని షాక్ ఇచ్చినట్లు సమాచారం. తెలుస్తున్న సమాచారంమేరకు తనకు కథ చెప్పడానికి ప్రయత్నించిన ఆ డైరెక్టర్ ప్రయత్నాలకు అడ్డుతగులుతూ కథ ఎంతబాగున్నా ఆ మూవీ ప్రాజెక్ట్ లో టాప్ హీరోలు ఉంటేనే తాను నటిస్తానని భవిష్యత్ లో తన డేట్స్ మిడిల్ రేంజ్ హీరోల సినిమాలకు ఇవ్వను అని చెప్పి ఆ డైరెక్టర్ కు రష్మిక మైండ్ బ్లాంక్ చేసినట్లు టాక్.  


దీనితో రష్మిక టాలీవుడ్ కు 'ఛలో' లాంటి చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం అప్పుడే రష్మిక మరిచిపోయిందా అంటూ ఆ యంగ్ డైరెక్టర్ తన సన్నిహితుల వద్ద కామెంట్ చేసినట్లు టాక్. ఈ సంవత్సరం సంక్రాంతి రేస్ కు వచ్చిన మహేష్ బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' లో నటించిన రష్మిక కు ఒక హిట్ రావడమే కాకుండా వెనువెంటనే వచ్చిన నితిన్‌ తో నటించిన ‘భీష్మ’ మూవీ కూడ హిట్ కావడంతో రష్మిక 2 కోట్లు డిమాండ్ చేస్తోంది అని టాక్.

అంతేకాదు తన కండిషన్స్ కు అడ్డు చెబితే తాను ఆ సినిమా చేయను అని చెప్పేస్తోందట ఈ క్రేజీ బ్యూటీ. స్టార్ డమ్ లేని హీరోల ప్రాజెక్ట్ లు తన దగ్గరకు తీసుకురావద్దని ఇప్పటికే రష్మిక తన మేనేజర్ ద్వారా తనకు కథలు వినిపించే దర్శక నిర్మాతలకు చెపుతోందట. కొరటాల శివ తీస్తున్న ‘ఆచార్య’ మూవీలో రామ్ చరణ్ పక్కన అదేవిధంగా సుకుమార్ బన్నీల మూవీ ప్రాజెక్ట్ లో కూడ రష్మిక ఎంపిక కావడంతో ఇప్పుడు ఆమెకు మిడిల్ రేంజ్ హీరోలు చిన్న హీరోలు కనిపించడం లేదు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: