ఏమాత్రం పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు ‘సన్నీ లియోన్’. ఏ క్షణాన బిగ్ బాస్ షో లో పాల్గొందో అక్కడి నుంచి ఆమె కెరీర్ మరో టర్న్ తీసుకుంది. బాలీవుడ్ దర్శకుడు మహేశ్ భట్ ఈమెను బాలీవుడ్ సినిమాల్లోకి తీసుకురావడం.. పూజా భట్ దర్శకత్వంలో జిస్మ్2 లో నటించడం జరిగిపోయాయి. దేశవ్యాప్తంగా వీరాభిమానులను సంపాదించుకున్న సన్నీ తెలుగులో కరెంట్ తీగ, గరుడవేగ సినిమాల్లో నటించింది. సన్నీతో ఫ్రెండ్ షిప్ ఉన్న హీరో నవదీప్ ఆమెపై రాసిన కవిత ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.

 

 

ప్రస్తుతం కరోనా వైరస్ అటాక్ తో దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉంది. ఈ సందర్భంగా సెలబ్రిటీలు అందరూ ప్రజలకు తగు జాగ్రత్తలు చెప్తున్నారు. నవదీప్ కూడా అలానే జాగ్రత్తలు చెప్తూ దానికి సన్నీ లియోన్ ను యాడ్ చేశాడు. సన్నీపై ఓ చిన్న కవిత రాస్తూ కరోనా టైమ్ లో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తున్నాడు. ‘సన్నీ ఈజ్ ఫన్నీ.. సన్నీ ఈజ్ స్మార్ట్.. సన్నీ ఈజ్ హోమ్.. సన్నీ ఈజ్ సేఫ్.. బిలైక్ సన్నీ లియోన్. అందరూ ఇళ్లలోనే ఉండి రాగిణి ఎమ్ఎమ్ఎస్ రిటర్న్స్ సినిమా చూడండి’ అంటూ ఓ చిన్న కవిత రాశాడు.

 

 

ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాగ్రామ్ లో సన్నీతో సన్నిహితంగా దిగిన ఫోటోను యాడ్ చేశాడు. ఇందులో నవదీప్ ను సన్నీ ఆటపట్టిస్తోంది. దీనికి నెటిజన్ల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ‘సన్నీ సేఫ్ గా ఉండడమే మాకు కావాలి’, ‘ఏమైనా నువ్వు లక్కీ భయ్యా’, ‘సన్నీ ఎలా ఉందో చెప్పు’ అంటూ నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు. రాగిణి ఎమ్ఎమ్ఎస్ రిటర్స్ సిరీస్ లో సన్నీతో కలిసి నటించాడు నవదీప్.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Sunny is funny sunny is smart sunny is home sunny is safe Be like @sunnyleone :) Isolate yourself n watch #raginimmsreturns

A post shared by Nav Deep (@pnavdeep) on

 

మరింత సమాచారం తెలుసుకోండి: