టాలీవుడ్, బాలీవుడ్ లో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు రాంగోపాల్ వర్మ.  ఆయన పేరు వింటేనే వెంటనే చెబుతారు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అని.. ఈ మద్య సోషల్ మాద్యమాలు వేధికగా చేసుకొని ఆయన చేస్తున్న కాంట్రవర్సీలు అన్నీ ఇన్నీ కావు.  ఆ మద్య ఏపి ఎన్నికల సందర్భంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎంత సంచలనం సృష్టించారుప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  తాజాగా నిత్యం వివాదాల జీవి.. ఎక్క‌డ ఎలాంటి వివాదం వున్నా దాన్ని క్యాష్ చేస‌కుంటూ వార్త‌ల్లో నిల‌వ‌డం ఆర్జీవీ ప్ర‌త్యేక‌త‌.

 

 సినిమాలు సక్సెస్ కాకపోయినా ఆ సినిమాల ప్రమోషన్ కోసం వర్మ చేసే ఫీట్లు మాత్రం ఓ రేంజ్‌ లో కాంట్రవర సృష్టిస్తున్నాయి.    అందుకు దేన్నీ వ‌ద‌ల‌ని నైజం ఆర్జీవీ సొంతం. దీన్నే క‌థా వ‌స్తువుగా తీసుకుని వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్‌వ‌ర్మ‌పై గేయ ర‌చ‌యిత జొన్న‌విత్తుల సంధిస్తున్న అస్త్రం `ఆర్జీవి`. `రోజూ గిల్లే వాడు` అని ఉప‌శీర్షిక‌. ఇందులో సురేష్‌, రాశి, శ్ర‌ద్ధా దాస్, అమిత్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.  కమ్మరాజ్యంలో కడప రెడ్లు పేరుతో వర్మ సినిమా ఎనౌన్స్ చేయటం కాంట్రవర్సీగా మారింది. కుల ప్రస్థావనతో సినిమాను రూపొందించటంపై రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరావు అభ్యంతరం వ్యక్తం చేశారు.

 

అంతేకాదు వర్మపై పలు టీవీ చర్చా కార్యక్రమాల్లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై వర్మ కూడా అదే స్థాయిలో స్పందించాడు. జొన్నవిత్తులు టీజ్ చేస్తూ కామెంట్స్ చేశాడు. వర్మ కామెంట్స్‌పై తీవ్రంగా స్పందించిన జొన్నవిత్తుల వర్మ బయోపిక్‌ను తీస్తా అంటూ ప్రకటించాడు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... `తా చెడ్డ కోతి వ‌న‌మంత చెరిచిన‌ట్లు త‌న పిచ్చి ఇజంతో యువ‌త‌ను పెడ‌త్రోవ ప‌ట్టిస్తున్న ఓ వ్య‌క్తి ఫిలాస‌ఫీ మీద సంధిస్తున్న రామ‌బాణమే అ సినిమా. శ్రీ‌రామ‌న‌వ‌మి ప‌ర్వ‌దినాన ఈ చిత్ర టైటిల్ లోగోని రిలీజ్ చేయ‌డం జ‌రిగింద‌ని వెల్ల‌డించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: