యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది ఈ కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ బారిన ఇప్పటికే 8 లక్షలమందికిపైగా పడ్డారు. అందులో 42వేలమంది మృత్యువాత పడ్డారు. ఇప్పటికే ఈ కరోనా వైరస్ అమెరికా, స్పెయిన్, ఇటలీ, ఇరాన్ వంటి దేశాల్లో విలయతాండవం చేస్తుంది. ఇంకా అలాంటి కరోనా వైరస్ ఇప్పుడు మంచి కుటుంబాన్ని దూరం చేసింది. 

 

అసలు జరిగింది ఏంటి అంటే? మంచు పెద్ద అబ్బాయి విష్ణు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో ద్వారా నెటిజన్ల ముందుకు వచ్చి కరోనా వైరస్ రాకుండా ఉండటానికి జాగ్రత్తలు చెప్తూనే తన భార్య పిల్లలు అమెరికాలో చిక్కుకుపోయారని చెప్తూ మంచు విష్ణు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 

 

అసలు వాళ్ళు ఎందుకు అమెరికాలో చిక్కుకుపోయారు? విష్ణు భార్య పిల్లలు ఎందుకు అమెరికాలో చిక్కుకుపోయారు అనే విషయానికి వస్తే.. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం భారత్ లో లాక్ డౌన్ విధించారు.. దీంతో ఎక్కడున్నా వారు అక్కడికే పరిమితం అయ్యారు. అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా నిలిచిపోవడంతో విదేశాల్లో ఉన్న భారతీయులు సొంత దేశానికి రాలేని పరిస్థితి. ఇంకా ఈ పరిస్థితిలోనే ఉన్నారు మంచు కుటుంబం కూడా. 

 

ఈ విషయంపై విష్ణు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఫిబ్రవరి నెలాఖరులో తమ బంధువుల్లో ఒకరికి సర్జరీ ఉండటంతో తన భార్యాపిల్లలతో కలిసి అమెరికా వెళ్లానని, అయితే తండ్రి మోహన్ బాబు పుట్టినరోజు వేడుకల నిమిత్తం తాను ముందుగానే అమెరికా నుంచి తిరిగి రావడం జరిగిందని మంచు విష్ణు చెప్పారు. 

 

ఇక తన భార్య విరానిక, పిల్లలు అరియానా, వివియానా, అవ్రామ్‌, ఐరా వద్దామనుకున్న సమయంలో మన దేశంలో పరిస్థితి విషమించి విమానాలు ఆపేయడంతో వాళ్ళు అక్కడే ఉండిపోయారని చెప్పారు. కుటుంబాన్ని చాలా మిస్ అవుతున్నానని చెబుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు మంచు విష్ణు. కానీ కరోనా కట్టడిలో లాక్‌డౌన్‌ అనేది చాలా కీలకం కాబట్టి అందరూ సహకరించాలని మంచు విష్ణు కోరారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: