బాలయ్య సీనియర్ హీరో. ఇప్పటికీ సింగిల్ గా వస్తున్నాడు. తాను నమ్ముకున్న బ్రాండ్ తోనే సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఫ్లాప్స్ ని అసలు పట్టించుకోని బాలయ్యకు వరసగా అవే తగిలేసరికి సీన్ మారుతోంది. ఒకటి రెండు కాదు మూడు భారీ డిజాస్టర్లు, దానికి ముందు ఏవరేజి మూవీస్ దాంతో బాలయ్య కెరీర్ డేంజర్లో పడిందని టాక్ మొదలైంది.

 

ఇదిలా ఉండగా బాలయ్య  స్క్రీన్ని ఎవరితో షేర్ చేసుకోవడానికి అసలు ఇష్టపడడడని అంటారు. ఆయనకు అలా  కావాలిస్తే ఇంట్లోనే హీరోలు ఉన్నారు. అపుడెపుడో కెరీర్ మొదట్లో  సీనియర్ ఎన్టీయార్ తో నటించాడు.  దానికి ముందు హరిక్రిష్ణతో కూడా చేశాడు. సోలో హీరో అయ్యాక బాలయ్య మరే హీరోతో నటించలేదు.

 

ఇవన్నీ ఇలా ఉంటే ఇపుడు బాలయ్య కెరీర్ చౌరస్తాలో ఉందని టాక్. దాన్ని మళ్ళీ ఏదో దారిలో పెట్టాలని ప్రయత్నాలు  గట్టిగానే జరుగుతున్నాయట. అందుకోసం బాలయ్య మల్టీస్టారర్ కి కూడా ఇపుడు ఓకే అంటున్నాడని చెబుతున్నారు. బాలయ్య రానాతో కలసి మళయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్  కోషియం మూవీని తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లుగా ప్రచారం సాగుతోంది.

 

మూవీ ఫిబ్రవరిలో వచ్చి ఘన విజయం సాధించడంతో దాని హక్కులను తీసుకున్న సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ వారు  బాలయ్య, రానాలతో నిర్మించాలనుకుంటున్నారుట. దాంతో ఈ మూవీ రీమేక్ వార్త బాగా స్ప్రెడ్ అవుతోంది. అయితే ఈ మూవీలో బాలయ్య రానాతో స్క్రీన్ షేర్ చేసుకుంటారన్న వార్తలే ఇంటెరెస్టింగ్ గా  ఉన్నాయి.

 

మల్టీ స్టారర్ మీద గతంలో బాలయ్య కొన్ని కామెంట్స్ చేశారు. తాను అలా చేస్తే కనుక తన కొడుకుతోనే మల్టీ స్టారర్  చేస్తానని కూడా చెప్పారు. ఇంకా తాను సోలో గానే నటిస్తానని కూడా అప్పట్లో గొప్పగా చెప్పుకొచ్చారు. ఈ మూవీ కనుక అనుకున్నట్లుగా సెట్స్ మీదకు వెళ్తే బాలయ్య మాటలు మారిపోయినట్లే. అలాగే,  ఇకపైన  సింగిల్  హీరోగా  హ్యాండిల్ చేయలేడా అన్న ప్రశ్నలు కూడా వస్తాయి.

 

ఇప్పటికే వెంకటేష్, నాగార్జున వంటి వారు అలా ఇతర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఒక్క చిరంజీవి బాలయ్య మాత్రమే ఇప్పటి దాకా  సింగిల్ గా వస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: