టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సాయి ధరమ్ తేజ్.  పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ ఈ మూవీస్ తో మంచి విజయం అందుకున్నాడు.  ఆ తర్వాత వరుసగా ఆరు సినిమాలు అపజయం పొందిన తర్వాత ఇక కెరీర్ కష్టాల్లో పడ్డ సమయంలో గత ఏడాది చిత్రలహరి, ప్రతిరోజూ పండుగే లతో వరుస హిట్స్ అందుకున్నాడు.  ఈ విజయాలతో సాయి ధరమ్ తేజ్ కథల విషయం లో జాగ్రత్త తీసుకుంటున్నాడు.  తాాజాగా సాయితేజ్  'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా రూపొందింది.  మే నెలలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. 

 

ఈ మూవీపై సాయి ధరమ్ తేజ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.  ఈ మూవీ తర్వాత వెంటనే దేవ కట్టా దర్శకత్వంలో చేయడానికి సాయితేజ్ సిద్ధమవుతున్నాడు. భగవాన్ - పుల్లారావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ పవర్ఫుల్ పొలిటికల్ లీడర్ గా కనిపించనుందనే వార్తలు వచ్చాయి.  ఈ మూవీలో రమ్యకృష్ణ సీఎం గా నటిస్తుందని అంటున్నారు.  గతంలో రజినీ కాంత్ నటించిన నరసింహ లో నీలాంబరిలా ఈ పాత్ర ఎంతో పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్లు సమాచారం. 

 

ఈ మూవీలో సాయితేజ్ స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. నేటి విద్యా విధానంలోని లొసుగులపై తిరుగుబాటుతో ఈ కథ నడుస్తుందని చెబుతున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రినే నిలదీసే పాత్రలో సాయితేజ్ కనిపించనున్నాడని అంటున్నారు.  అయితే ఇప్పటి వరకు సాయితేజ్ ఈ టైప్ పాత్రలో ఎప్పుడు కనిపించలేదని.. ఈ పాత్ర సాయితేజ్ కి సరికొత్తగా చూడబోతున్నట్లు చిత్ర యూనిట్ అంటున్నారు.  ఇక వరుస విజయాలు అందుకుంటున్న సాయితేజ్ ఈసారి మరో విజయం ఖాయం అని అంటున్నారు.  మరి రమ్యకృష్ణ, సాయితేజ్ ఫైట్ ఎలా ఉండబోతుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: