ప్రస్తుతం కరోనా వ్యాధి నేపథ్యంలో ప్రజలతో పాటు ముఖ్యంగా పలు దేశ ప్రభుత్వాలు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మహమ్మారి మరింతగా తీవ్రతరం కాకుండా ఉండేందుకు ప్రజలను కొన్నాళ్లపాటు పూర్తిగా తమ తమ ఇళ్లకు పరిమితం అయ్యేలా చేయాలని భావించిన దేశాలు లాకౌట్ ప్రకటించడం జరిగింది. కాగా మన దేశాన్ని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొత్తంగా 21 రోజులు లాకౌట్ చేస్తునంట్లు ఇటీవల ప్రకటన చేసారు. అయితే లాకౌట్ ని మెజారిటీ ప్రజలు పాటిస్తూ తమ వంతుగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తన్నప్పటికీ, కేవలం అతి కొద్ది మంత్రం దానిని పెద్దగా ఖాతరు చేయకుండా ఎక్కువగా అదేపనిగా బయట తిరగడం వంటివి చేస్తున్నారని, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు కేవలం అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రాకూడదని రాజకీయ నాయకులు, అధికారులు, పలువురు ప్రముఖులు అభ్యర్థిస్తున్నారు. 

 

ఎందుకంటే ఆ విధంగా ఎక్కువగా బయట తిరిగితే వ్యాధి ఉన్న వ్యక్తుల ద్వారా ఒకరి నుండి మరొకరికి వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుందని, కావున ప్రభుత్వ సూచనలను గట్టిగా పాటించాలని కోరుతున్నారు. ఇక నేడు టాలీవుడ్ డైలాగ్ కింగ్ గా పేరుగాంచిన సాయి కుమార్, కాసేపటి క్రితం ఈ మహమ్మారి కరోనా పట్ల ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపై ఒక చిన్న వీడియో పోస్ట్ చేసారు. ఆయన మాట్లాడుతూ, కనిపించే మూడు సింహాలు డాక్టర్లు, పోలీసులు, పారిశుధ్య కార్మికులైతే, కనిపించని నాలుగవ సింహం మనమే అని, అంటే ప్రజలందరమూ కూడా కనిపించని సింహాలవంటి వారమేనని అన్నారు. 

 

అయితే ఈ సమయంలో మనం దేశానికి తప్పనిసరిగా సేవచేయాలని, అయితే దానికోసం మనం ప్రత్యేకంగా కష్టపడనవసరం లేకుండా కేవలం ఎవరి ఇంట్లో వారు ఉండి కొన్నాళ్ళు గడిపితే చాలని, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రజలందరూ కూడా ప్రభుత్వ ఆదేశాలు పాటించి ఈ లాకౌట్ ని విజయవంతం చేస్తే తప్పకుండా ఈ మహమ్మారి కరోనని గట్టిగా మన దేశం నుండి తరిమి కొట్టవచ్చని సాయి కుమార్ కోరడం జరిగింది....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: