నిధి అగర్వాల్...హిందీ సినిమా 'మున్నా మైఖేల్‌'తో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన నిధి అగర్వాల్. తొలి సినిమాతోనే అందాలు ఆరబోస్తూనే, తన డాన్సులతో అదరగొట్టింది. అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన 'సవ్యసాచి' చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నిధి, తర్వాత అఖిల్ అక్కినేని హీరోగా వచ్చిన 'మిస్టర్ మజ్ను' చిత్రంలోనూ నటించింది. ఈ రెండు చిత్రాలు పెద్దగా విజయం సాధించకపోయినా ఆమెకు మంచి పేరే తెచ్చి పెట్టాయి. డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రామ్ హీరోగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీలో నటించిన నిధి అగర్వాల్ ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ చిత్రంలో తన యాక్టింగ్ తో మంచి మార్కులే కొట్టేసింది.

 

యూత్ లో ఆమెకు ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆక్టివ్ గా ఉంటూ, వయ్యారాలు ఒలకబోసే ఫోటోలు పోస్ట్ చేస్తూ కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తుంది. ఈమె ఫోటోల కోసం నెటిజన్లు ఆరాటంగా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇంటికే పరిమితమైన సెలెబ్రెటీల రకరకాల ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా షూటింగులు లేక ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్న ఈ బ్యూటీ తనలో దాగివున్న టాలెంట్ ను బయటకి తీసే పనిలో పడింది. మొన్నటి దాకా హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ హీట్ పెంచిన ఈ భామ ఇప్పుడు హాట్ కేకులు తయారు చేస్తూ సమయం గడుపుతోంది. కేక్స్ బేక్ చేస్తూ, వాటిని టేస్ట్ చేస్తూ ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా నిధి అగర్వాల్ ప్రస్తుతం తమిళంలో జయం రవితో 'భూమి' సినిమాలో నటిస్తుండగా, తెలుగులో మహేష్ బాబు మేనల్లుడు అరంగేట్రం చేసే మూవీలో హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: