సూపర్ స్టార్ మహేష్ బాబు 27వ చిత్రానికి గీతగోవిందం ఫేం పరశురాం దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహేష్ బాబు 27 ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్రంలో కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడం కాస్త డిలే అవుతోంది.  లేదంటే ఈపాటికే ఈ సినిమా పట్టాలెక్కేయాల్సి ఉండేది. ఇక తాజా సమాచారం ప్రకారం జూన్ లేదా జూలై నుండి ఈ సినిమాని ప్రారంభించాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారట. దాంతో పరశురాం కి బాగా టైం దొరకింది. అందుకే రిలాక్స్డ్ గా కూర్చుని నటీనటులు..సాంకేతిక నిపుణులను ఎంపిక చేసుకుంటున్నాడట. 

 

అయిత్రే ఇప్పటికే మహేష్ బాబు కు జంటగా కీర్తి సురేష్ ని తీసుకుంటున్నట్లు నిన్నటి వరకు జోరుగా ప్రచారంలోకి జరిగింది. అయితే కీర్తి కాదు కియారా అంటూ మళ్ళీ ఫిల్మ్ నగర్ లో టాక్ మొదలైంది. 'భరత్ అనే నేను' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కియరా మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా యమా బిజీ గా ఉంది. అంతేకాదు అక్కడ కియారా నటిస్తున్న సినిమాలన్ని సూపర్ హిట్ ని అందుకుంటున్నాయి. దాంతో మరోసారి మహేష్ సరసన కియారాకి ఛాన్సిస్తున్నారని తెలుస్తోంది. 

 

ఇప్పటికే ఎంబీ 27 కోసం పరశురామ్ కి కియరాను రికమండ్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. అందుకు కారణం ఫ్యాన్స్ అని కూడా అర్థమవుతుంది. కీర్తి కి నెగిటివ్ సెంటిమెంట్ ఉందని బాబు కి ఫ్యాన్సే సజష్ చేశారట. అందుకే ఇప్పుడు మహేష్ బాబు పరశురాం కలిసి కియారాని తీసుకోవాలని ట్రై చేస్తున్నారట. వాస్తవంగా కీర్తికి టాలీవుడ్ లో హిట్ అంటే మహానటి సినిమానే. కాని అందరూ ఆ సినిమాని ఎప్పుడో మర్చిపోయారు. ఇక తెలుగులో నితిన్ సరసన రంగ్ దే సినిమాలో చేస్తుంది. ఈ సినిమా గనక హిట్ అయితే టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వస్తాయి. లేదంటే అంతే ఇక. దీంతో మహేష్ బాబు, పరశురాం కియారా కే ఓటేశారని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: