ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం ఎంత దారుణంగా పడిందో అందరికీ తెలిసిందే. సామాన్య ప్రజల దగ్గర నుంచి కోట్లకి అధిపతి అయిన వాళ్ళ వరకు కరోనా ప్రభావం భయంకరంగా చూపించింది. ఈ నేపథ్యంలో పెద్ద వ్యాపార సంస్థల తో పాటు సౌత్, నార్త్ .. సినీ ఇండస్ట్రీస్ కి ఇప్పట్లో కోలుకోలేని దెబ్బ అన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్స్ మీద కరోనా ప్రభావం ఎక్కువగా పడిందని తాజా పరిస్థితులు చెబుతున్నాయి. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కి ఈ కరోనా ఊబిలోకి లాగేసిందని అంటున్నారు.

 

నిర్మాత దిల్ రాజు కి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయన్న విషయం తెలిసిందే. సినిమా బ్లాక్ బస్టర్ అయిందని సక్సస్ మీట్ లు నిర్వహించుకునేలోపే వరుసగా రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అన్న టాక్ విని కుమిలిపోతున్నాడు. అంతేకాదు ఆయన డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలు దిల్ రాజుకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఇక నిర్మాతగా చిన్న సినిమాలు తీసి సరిగ్గా ప్రమోట్ చేయక దెబ్బ తిన్నాడు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మిస్తున్న బాలీవుడ్ హిట్ సినిమా రీమేక్ వకీల్ సాబ్ ని భారీగా నిర్మిస్తున్నారు. 

 

ఈ సినిమాతో పాటు దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి భారీ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ నైజాం పంపిణీ హక్కులు భారీ మొత్తానికి దక్కించుకున్నారు. అయితే కరోనా ప్రభావంతో ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీ మార్కెట్ కి పెద్ద దెబ్బ పడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దిల్ రాజు ..దర్శకుడు రాజమౌళి, నిర్మాత డివివి దానయ్యతో చర్చలు జరుపుతున్నారట. ముందుగా చేసుకున్న ఒప్పందానికి తీసుకోలేనని బడ్జెట్ తగ్గించుకోమని అన్నాడట. అయితే సినిమా రిలీజ్ ఇంకా చాలా సమయం ఉండటంతో రాజమౌళి, దానయ్య .. దిల్ రాజు కి ఇప్పుడే ఆ మ్యాటర్ గురించి టెన్షన్ పడొద్దని అన్నారట. కాని దిల్ రాజు మాత్రం ఇటు వకీల్ సాబ్, అటు ఆర్.ఆర్.ఆర్ విషయంలో బాగా ఇరుక్కుపోయినట్టు ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నారు.  

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. 
క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

https://tinyurl.com/NIHWNgoogle

 

https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: