దేశ ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వం 21 రోజులు లాక్ డౌన్ విదించిన విషయం తెలిసిందే. ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయి కేవలం నిత్యవసర సరుకుల కోసం మాత్రమే బయటకు వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ గా ఆదేశించింది. రెడ్ జోన్ లలో అయితే రోజుకి కేవలం మూడు గంటలే.. అది కూడా తెల్లవారుజామునే బయటికి వచ్చి అన్నీ కొనుక్కుని వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వడం తో రోడ్లన్నీ నిర్మానుష్యంగా తయారయ్యాయి.

 

అదే కాకుండా సినిమా షూటింగులు కూడా ఎక్కడికక్కడ ఆగిపోవడంతో సెలబ్రిటీలు ఇంట్లో ఉంటూ తను చేస్తున్న పనులను వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో తమ అభిమానుల కోసం పోస్ట్ చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది ఇన్స్టాగ్రామ్ ద్వారా లైవ్ లోకి వచ్చి అభిమానులతో ముచ్చటిస్తూ ఉన్నారు.

 

ఇదిలా ఉండగా తన అందాలతో కుర్రకారుని రెచ్చగొట్టే బుల్లితెర హాట్ యాంకర్ తో సోషల్ మీడియాలో ఇటీవలే లైవ్ లో కబుర్లు చెబుతూ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో చలించిపోయిన కుర్రకారు అంతా ఆమె కన్నీళ్లు పెట్టుకున్న విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఆమెను ఆమె కన్నీళ్లు పెట్టుకోనివ్వకుండా చేస్తామని అనేస్తున్నారు కూడా.

 

ఇంతకీ విషయం ఏమిటంటే.... లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో రోడ్డుపై మూగజీవాలు ఆహారం లేక అనేక అవస్థలు పడుతున్నాయని ఆవేదనతో రేష్మి లైవ్లో చెప్పుకొచ్చింది. మీ మీ ప్రాంతాల్లో చుట్టుప్రక్కల ఉన్న చోట అవకాశం దొరికితే వాటికి ఆహారం అందించాలని కోరింది. అంతేకాకుండా చుట్టుప్రక్కల ఉన్న పేద ప్రజలకు కూడా ఆహారం అందించాలని అభిమానులకు విన్నవించింది.కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన పేదల ఆహారం కోసం రష్మీ 25 వేలు విరాళం ఇచ్చింది. స్వయంగా రష్మీ తన ప్రాంతంలోని జంతువులకు ఆహరం ఏర్పాటు చేసింది. రష్మీ కన్నీరు మున్నీరుగా విలపించిన వీడియో వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: