టాలీవుడ్ లో సీనియర్ హీరోలకు ఇప్పటికీ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సీనియర్ స్టార్స్ యంగ్ స్టార్ హీరోలతో పోటీ పడి సినిమాలు చేసి సక్సస్ లు మాత్రం దక్కించుకోలేకపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, బాలకృష్ణ వరస సినిమాలు మాత్రం చేస్తున్నారు. కానీ వీళ్ళ ఖాతాలో సక్సస్ లు మాత్రం పడటం లేదు. ఇంకా చెప్పాలంటే ఈ సీనియర్ స్టార్స్ గతం లో ఉన్న ఫాం ని ఇప్పుడు కొనసాగించలేక సతమతమవుతున్నారు.

 

సంవత్సరామికో రెండేళ్ళకో ఒక హిట్ పడితే .. హమ్మయ్య అదే పెద్ద పండగ అంటూ ఫీలవుతున్నారు. కాని ఈ ముగ్గురికి భిన్నంగా వెంకటేష్ మాత్రం వరుస హిట్స్ తో మాంచి జోరు మీద ఉన్నారు. అంతేకాదు వెంకటేష్ ఈ మధ్య యంగ్ హీరోలతో మల్టీ స్టారర్స్ తో పాటు గురు వంటి విభిన్నమైన సినిమాలని చేస్తూ సక్సస్ లు అందుకుంటున్నరు. సూపర్ స్టార్ మహేష్ బాబు తో కలిసి వెంకీ చేసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు హిట్ గా నిలిచింది. ఆ తరువాత రామ్ తో మసాలా, ఓ మై గాడ్ తెలుగు రీమేక్ గోపాల గోపాల సినిమా లో పవన్ తో కలిసి నటించారు. 

 

ఇక గత సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో కలిసి నటించిన ఎఫ్ 2 ఏడాది వచ్చి సూపర్ హిట్ అందుకుంది. అంతేకాదు ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోను చేరింది. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 2 కి సీక్వెల్ గా ఎఫ్ 3 కి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా వెంకటేష్ నటించనున్నారు. అయితే ఈ సినిమా కోసం వెంకటేష్ తన రెమ్యూనరేషన్ బాగా పెంచేశారని తాజా సమాచారం. తన రెగ్యులర్ రెమ్యూనరేషన్ కి రెట్టింపు వెంకీ డిమాండ్ చేస్తున్నారని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

 

అయితే అందుకు కారణం వెంకటేష్ ట్రాక్ రికార్డ్ బావుండటమే అని అంటున్నారు. వెంకీ చేసిన గత రెండు సినిమాలు ఎఫ్ 2, వెంకీ మామ మంచి కమర్షియల్ హిట్స్ నిలిచాయి. అందుకే ఈ సీనియర్ హీరో తన రెమ్యూనరేషన్ బాగా పెంచారని తెలుస్తుంది. వెంకటేష్ కి కూడా పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవడం కోసమే ఇలా రెమ్యూనరేషన్ భారీగా పెంచారని అంటున్నారు. ఇక వెంకటేష్ ప్రస్తుతం తమిళ్ రీమేక్ 'అసురన్'లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి 'నారప్ప' అనే టైటిల్ ఫిక్స్ చేయగా హీరోయిన్ గా ప్రియమణి నటిస్తుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సురేష్ బాబు నిర్మిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: