మళయాళ ప్రేమమ్ సినిమాలో మలార్ పాత్రలో మెప్పించిన సాయి పల్లవి తెలుగులో ఫిదా సినిమాతో సూపర్ ఎంట్రీ ఇచ్చింది. అప్పటికే సౌత్ లో మంచి క్రేజ్ సాధించిన ఈ అమ్మడు ఫిదాలో భానుమతిగా అదరగొట్టింది. ఆ సినిమా హిట్ లో ఆమెకె అగ్ర తాంబూలం ఇచ్చేశారు. ఇక ఆ తర్వాత ఎం.సి.ఏ, పడి పడి లేచే మనసు లాంటి సినిమాలు చేసింది. సాయి పల్లవి సినిమా అనగానే ఆడియెన్స్ లో అంచనాలు భారీగా ఉంటాయి. గ్లామర్ షో అసలేమాత్రం చేయని సాయి పల్లవి సినిమా సినిమాకు తన నటనతో సర్ ప్రయిజ్ చేస్తుంది. అందుకే ఆమెకు తెలుగులో అంట పాపులారిటీ వచ్చింది. 

 

ఫిదాలో భానుమతి పాత్రలానే రియల్ లైఫ్ లో కూడా ఇల్లు వదిలి ఎక్కడికి రాదట సాయి పల్లవి. ఉంటే షూటింగ్ చేయడం లేదంటే ఇంట్లో ఉండటం ఇదే పనట. ఇక పెళ్లి మీద అసలేమాత్రం ఇంట్రెస్ట్ లేదని చెబుతున్న సాయి పల్లవి. పెళ్లి చేసుకోకుండా ఉంటానని చెబుతుంది. ఎందుకంటే పెళ్లి చేసుకుంటే వచ్చే వ్యక్తి తన తల్లిదండ్రులను సరిగా చూసుకుంటాడో లేడో అన్న డౌట్ ఉందట. అయితే ఒకవేళ అంతగా చేసుకోవాల్సి వస్తే ఫిదా సినిమాలో వరుణ్ తేజ్ క్యారక్టర్ ఉన్న వ్యక్తిని పెళ్లాడుతా అంటుంది సాయి పల్లవి. తనంటే ఇష్టం ఉండి తనతో పాటు తన ఇంటి దగ్గరే ఉండే అబ్బాయి తనకు కావాలని అంటుంది. 

 

అంటే ఒక్కమాటలో చెప్పాలంటే ఇల్లరికం వచ్చే అబ్బాయి కావాలని అంటుందన్నమాట. మరి సాయి పల్లవి కోసం అలా వచ్చే అబ్బాయి ఎవరో చూడాలి. ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తున్న సాయి పల్లవి తెలుగులో విరాటపర్వం, నాగ చైతన్యతో లవ్ స్టోరీ సినిమాలు చేస్తుంది. ఈ రెండు సినిమాలతో మళ్ళీ తన సత్తా చాటాలని చూస్తుంది అమ్మడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: