తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఎంత ఫాలోయింగ్ ఉందో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. బాషా, అన్నామలై, ముత్తు, అరుణాచలం, నరసింహ, రోబో ఇలా ప్రతి సినిమా ప్రేక్షకులకు వినోదాన్ని పంచిపెట్టింది. ముత్తు సినిమాతో ఆయన సినిమాలు జపనీస్ లోకి డబ్బింగ్ అవడం మొదలైంది. జపాన్, సౌదీ, బ్రిటన్, అమెరికా దేశాల్లోనూ రజనీ సినిమా అంటే ఓరేంజ్‌లో హడావిడి ఉంటుంది. ఆయనకి ఫ్యాన్స్ దేశ నలుములాల కూడా ఉన్నారు. ఈ ఏడాదికి 'దర్బార్' సినిమాతో పలకరించి సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.  సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా యాక్షన్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.

 

డైరెక్టర్ శివ ఈ చిత్రంలో రజనీ సరసన సీనియర్ బ్యూటీ ఖుష్బూను హీరోయిన్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాలో రజని భార్యగా ఖుష్బూ నటిస్తోందట. గ్లామర్ పరంగా ఇప్పటికీ ఏ మాత్రం వంక పెట్టలేని విధంగా ఉండే ఖుష్బూ.. మరి రజిని సరసన ఈ లేట్ వయసులో ఏ రేంజ్ రొమాన్స్ చేస్తోందో చూడాలి. రజనీ గత సినిమాలు చూసుకుంటే ‘కాలా’లో సీనియర్ నటి ఈశ్వరీ రావ్, ‘పేటా’లో సిమ్రన్ తో కలిసి నటించారాయన. ఇప్పుడు ఈ చిత్రంలో ఖుష్బూతో జోడీ కడుతున్నారని సమాచారం. అన్నట్టు గతంలో రజనీ, ఖుష్బూలు కలిసి ‘అన్నామలై, మన్నన్, పాండియన్, నట్టుక్కు ఓరు నల్లవన్’ వంటి సినిమాలు చేశారు. రజనీ మొదటిసారి శివతో చేస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో ఈ సినిమా పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాని రజనీతో ‘రోబో, పేట’ సినిమాల్ని నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. చాలా గ్యాప్ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఎన్ని రికార్డులని తిరగ రాయబోతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: