మాస్ మహారాజ్ రవితేజ - గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో చిత్రం క్రాక్. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా  వస్తున్న ఈచిత్రంలో రవితేజ , పోలీస్ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా 80శాతం పైగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇటీవల విడుదలైన టీజర్ సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకోవడంతో సినిమా పై అంచనాలు పెరిగాయి. ఇక ఈరోజు శ్రీరామ నవమి కానుకగా ఈ సినిమా నుండి లేటెస్ట్ పోస్టర్ విడుదలైంది. ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా సముద్రఖని , చిరాగ్ జానీ , వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
 
కాగా చాలా గ్యాప్ తరువాత శృతి హాసన్ ఈ సినిమాతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ముందుగా ఈ చిత్రాన్ని మే  8న విడుదలచేయాలనుకున్నారు కానీ కరోనా వల్ల  ప్రస్తుతం షూటింగ్ రద్దు కావడం తో విడుదల తేది మారే అవకాశాలు వున్నాయి. ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక గత కొంత కాలంగా వరుసగా భారీ డిజాస్టర్ లను చవిచూస్తూ వస్తున్న రవితేజ, క్రాక్ పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. 
 
ఇదిలావుంటే ఈ సినిమా ఇంకా సెట్స్ మీద ఉండగానే వరస సినిమాలకు సైన్ చేశాడు రవితేజ.. అందులో భాగంగా క్రాక్ తరువాత ఆయన , రమేష్ వర్మ  డైరెక్షన్ లో నటించనున్నాడు. మేలో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. వీరిద్దరి కలయికలో ఇంతకుముందు వచ్చిన వీర డిజాస్టర్ అయ్యింది. ఇక రమేష్ వర్మ సినిమా తరువాత త్రినాథ రావు నక్కిన డైరెక్షన్ లో  నటించనున్నాడు రవితేజ. ఈ రెండు సినిమాలతో పాటు ఇటీవల  నాపేరు సూర్య ఫేమ్  వక్కంతం వంశీ డైరెక్షన్ లో కూడా నటించడానికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: