అజయ్ దేవగన్ తాజాగా తానాజీ అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీసు వ‌ద్ద రెండు వందల కోట్లకు పైగా కలెక్ట్ చేసి సూపర్  నిలిచింది. అజయ్ దేవగన్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ చిత్రం ద్వారా మన తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా క్రీడా నేపథ్యంలో 'మైదాన్' అనే చిత్రంలో కూడా నటిస్తున్నాడు. అయితే ఇప్పుడు అజయ్ దేవగన్ తమిళ రీమేక్ చేయబోతున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. ఇటీవల కాలంగా కంటెంట్‌ ప్రధానంగా సాగే చిత్రాలకు, తెరకెక్కించే దర్శకులకు మంచి డిమాండ్‌ ఏర్పడింది. ఆ చిత్రాలను ఇతర భాషల్లో రీమేక్ చేయడానికి పోటీ పడుతుంటారు. ఇప్పటికే మన దక్షిణాదిలో హిట్ అయిన చాలా సినిమాలను హిందీలో రీమేక్ చేసారు. వాటితో బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్నారు.

 

ఈ నేపథ్యంలో కార్తీ హీరోగా ఇటీవల ఘనవిజయం సాధించిన తమిళ సినిమా ఖైదీని హిందీలో రీమేక్ చేస్తున్నారు. తమిళ్‌తో పాటు తెలుగులోనూ 'ఖైదీ' సినిమా సూపర్‌ హిట్ అయ్యింది. కేవలం ఒక్క రాత్రిలో జరిగిన సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా లాస్ట్ ఇయర్ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మధ్య దక్షిణాది పరిశ్రమల సినిమాల పై ఆసక్తిగా ఉన్న బాలీవుడ్ నిర్మాతలకు ఈ చిత్రం బాగా నచ్చింది. అందుకే ఈ రీమేక్ చిత్రంలో స్టార్ హీరోనే ఉంచాలని భావించి అజయ్ దేవగన్ ను సంప్రదించగా అజయ్ దేవగన్ సైతం ఈ చిత్రాన్ని చూసి వెంటనే డేట్స్ ఇచ్ఛేసిన సంగతి తెలిసిందే. కరోనా దెబ్బకు ఈ సినిమా షూటింగ్ వెనక్కి వెళ్లిన సంగతి తెలిసింది.

 

ఇదిలా ఉండగా తాజాగా బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం అక్టోబర్ ఫస్ట్ వీక్ నుండి ఈ రీమేక్ మూవీ షూటింగ్ ను మొదలుపెట్టాలని చిత్రబృందం భావిస్తోంది. 2021 ఫిబ్రవరి 12న ఈ రీమేక్ విడుదలవుతుందని కూడా అజయ్ దేవగన్ అనౌన్స్ కూడా చేశారు. ఇక కేవలం హీరో మీద, మాస్ ఎంలిమెంట్స్, ఫాధర్, డాటర్ ఎమోషన్ మీదే నడిచిన ఈ చిత్ర కథ హిందీ ప్రేక్షకులకి కొత్త అనుభూతిని అందిస్తుందని భావించిన రిలయన్స్ ఎంటెర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. పూర్తి వివరాలు చిత్ర యూనిట్ త్వరలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కార్తి హీరోగా ఈ చిత్రం మంచి కలెక్షన్స్ సాధించింది. మరి అజయ్ దేవగన్ హీరోగా ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ సాధిస్తోందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: