అల వైకుంఠపురములో వంటి బ్లాక్ బస్టర్ హిట్‌ అందుకుని అల్లు అర్జున్ మంచి జోష్ మీద ఉన్నాడు. తన సక్సెస్ జర్నీని ఇలాగే కంటిన్యూ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు బన్నీ. అందుకే తన తర్వాత సినిమాను హిట్ డైరెక్టర్ సుకుమార్ తో చేయాలని నిర్ణయించుకున్నాడు. దాంతో ఈ మధ్యే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. కానీ చిత్ర బృందం మాత్రం ఇప్పటివరకు ఈ సినిమా టైటిల్ ను విడుదల చేయలేదు. కాగా ఈ నెల 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా, ఆయన కొత్త సినిమా టైటిల్ లోగోను విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న స్టయిలిష్ స్టార్ ఫ్యాన్స్‌ ఆ రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

 

 

కొన్ని రోజుల క్రితం, ఈ సినిమాకు శేషాచలం అనే టైటిల్ ఖరారైనట్టు వార్తలు వచ్చాయి. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుందని, అందుకే ఈ సినిమాకు ఆ టైటిల్ ఓకే చేసారని ప్రచారం జరిగింది. అయితే చిత్ర యూనిట్ దాన్ని ఖండించింది. దాంతో ఈ సినిమాకు ఏ టైటిల్ అనుకుంటున్నారో అనే ఆసక్తి బన్నీ అభిమానుల్లో ఎక్కువయింది.

 

 

అసలే రంగస్థలం వంటి హిట్‌తో తన రేంజ్‌ను మరింత పెంచుకున్న సుకుమార్, బన్నీతో మరో బ్లాక్ బస్టర్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా టైటిల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే ఈ సినిమాకు ఎలాంటి టైటిల్‌ను ఫిక్స్ చేస్తారా అని అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అందుకే అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా డైరెక్టర్ సుకుమార్సినిమా టైటిల్ ను రెవీల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసందే. జబర్దస్త్ యాంకర్ అనసూయ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. మైత్రీమూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి లాక్ డౌన్ వల్ల బ్రేక్ పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: