దర్శక ధీరుడు రాజమౌళికి దేశవ్యాప్తంగా మాములు క్రేజ్ లేదు. పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హీరోలకు ఉండే క్రేజ్ ని ఆయన సినిమాలతో దక్కించుకున్నారు. బాహుబలి సినిమాతో రాజమౌళి దేశం మొత్తానికి పరిచయమయ్యాడు. ప్రస్తుతం ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా "రౌద్రం రుధిరం రణం" ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ లు ప్రధాన పాత్రలు పోషిస్తుండగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాట సమయంలో వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ల జీవితగాథల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమా మోషన్ పోస్టర్ ను చిత్రబృందం ఇటీవలే విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఆ మోషన్ పోస్టర్ సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే.

 

అత్యంత భారీగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో తారాగణం కూడా అంతే భారీగా ఉంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్.. చరణ్ సరసన హీరోయిన్‌గా నటిస్తుండగా బ్రిటిష్ నటి ఒలివియా మోరిస్‌ను ఎన్టీఆర్‌కు జతగా తీసుకున్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ రామ్ చరణ్ లు మిగతా కమిట్మెంట్స్ పక్కన పెట్టి రెండేళ్ల డేట్స్ రాజమౌళికి ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఏ డిబేట్ లో అయినా అందరికి ఎదురవుతున్న మొదటి ప్రశ్న 'ఈ చిత్రం ద్వారా ఈ ఇద్దరి హీరోల్లో ఎవరి మార్కెట్ పెరగబోతోంది.. ? అని. ఎన్టీఆర్ అభిమానులు మా హీరో మార్కెట్ మెరుగుద్ది అంటే, రామ్ చరణ్ అభిమానులు మా హీరో మార్కెట్ పెరుగుద్ది అంటూ పోటా పోటీ కామెంట్స్ చేసుకుంటున్నారు.

 

వాళ్ళిద్దరి ఫ్యాన్స్ ప్రభాస్ ని మించి మార్కెట్ పెరుగుద్దని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ప్రభాస్ కి ఈ మార్కెట్ 'బాహుబలి' లాంటి పాన్ ఇండియా సినిమాతో వచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ యాక్టింగ్ ఒక్కటే దీనికి హెల్ప్ అవలేదు. బాహుబలి ఒక కల్ట్ సినిమా కావడంతో అది హిందీ ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుని మరో పదేళ్లు ఎవరూ టచ్ చేయని రికార్డ్స్ సృష్టించడం వల్ల కూడా వచ్చింది. కానీ ప్రభాస్ తన నెక్స్ట్ సినిమా 'సాహో'తో తన మార్కెట్ కాపాడుకున్నాడనే చెప్పొచ్చు. ఈ సినిమా మన టాలీవుడ్ లో కంటే బాలీవుడ్ లో ఎక్కువ కలెక్ట్ చేసింది. ఒకవేళ రాజమౌళి ఈ సినిమాతో హిట్ కొడితే హీరోల కంటే ఈయన మార్కెట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఏదేమైనా ఫ్యాన్స్ ఇవన్నీ పక్కన పెట్టి సినిమా విడుదలయ్యాక తమ అభిమాన హీరోల సినిమా చూసి ఎంజాయ్ చేయాలని సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: