పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా టాలీవుడ్ మాటల మాంత్రికుడిగా పేరు సంపాదించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జల్సా సినిమా నేటితో సక్సెస్ఫుల్ గా పన్నెండేళ్ళు పూర్తిచేసుకుంది. అందాల భామలు ఇలియానా, పార్వతి మెల్టన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా అప్పట్లో మంచి క్రేజ్ తో రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టింది. ఈ సినిమా ద్వారా తొలిసారిగా పవన్ ను దర్శకత్వం వహించే ఛాన్స్ కొట్టిన త్రివిక్రమ్, ఇందులో మరొక స్టార్ హీరో అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు తో కొన్ని కీలక సన్నివేశాలకు వాయిస్ ఓవర్ ఇప్పించారు, ఒకరకంగా అది కూడా ఈ సినిమా సక్సెస్ కు కొంతవరకు కలిసొచ్చింది అని చెప్పాలి. 

 

ఇక సినిమాకు మరీ ముఖ్యంగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన సాంగ్స్ అయితే అప్పట్లో ఒక పెద్ద రికార్డు ని సృష్టించాయి. కుటుంబంలో ఒక్కసారిగా రెండు విషాదాలు చోటుచేసుకోవడం, అలానే సమాజంలోని స్థితిగతులపై విరక్తి చెందిన ఒక యువకుడు నక్సలైట్ గా మారడం, ఆపై అతని జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా పలు కమర్షియల్ అంశాల మేళవింపుగా దర్శకుడు త్రివిక్రమ్ తన మార్క్ పంచ్ డైలాగ్స్ జోడించి ఈ సినిమాని తీయడం జరిగింది. ఇక సినిమాలో విలన్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిన ముఖేష్ రుషి పై కూడా అప్పట్లో ప్రశంసలు కురిశాయి. 

 

వాస్తవానికి అంతకముందు కొన్నాళ్ల నుండి కెరీర్ పరంగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ కు ఈ సినిమా సూపర్ హిట్ కొట్టి మంచి బ్రేక్ ని ఇచ్చింది. ఇది ఈ సినిమా నేటితో 12 ఏళ్ళు పూర్తి చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఎన్నేళ్లు గడచినా పవన్, త్రివిక్రమ్ ల కాంబోలో రిలీజ్ అయి, అప్పట్లో పెద్ద మ్యాజిక్ సృష్టించిన ఈ సినిమాని తాము ఎప్పటికీ మరిచిపోలేమని అంటున్నారు పవన్ ఫ్యాన్స్.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: