ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే. అయితే దీని వలన ప్రజలందరూ ఎటువంటి పనులు లేక ఇంటికే పూర్తిగా పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో ఇళ్లకే పరిమితమైన సెలెబ్రెటీలు ఫొటోలతో, వీడియోలతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. అయితే సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉన్న కొంతమందిపై పుకార్లు కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. తాజాగా శ్రద్ధా శ్రీనాథ్ కి కరోనా వచ్చిందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

 

'జెర్సీ’ సినిమాతో తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకుంది శ్రద్ధ. ఇందులో ప్రియురాలిగా, భార్యగా మెచ్యూరిటి కలిగిన నటనతో మెస్మరైజ్ చేసింది. ఆ తర్వాత ‘జోడి’ వంటి చిత్రాల్లో నటించింది. తమిళంలో విక్రమ్ వేద, అజిత్ తో కలసి నెర్కొంద పార్వయి, యూ టర్న్ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు పలు తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది. అయితే దేశ వ్యాప్తంగా కరోనా నేపథ్యంలో డౌట్ వచ్చిన వాళ్ళందరిని ఐసోలేషన్ లో పెడుతున్న విషయం తెలిసిందే. శ్రద్ధా శ్రీనాథ్ ప్రయాణించిన ఫ్లైట్ లో కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్న వ్యక్తి ప్రయాణం చేసినట్లు, అందువల్ల కర్ణాటక వైద్య అధికారులు ఈమెను ఐసోలేషన్ తరలించినట్లు ఒక తమిళ వెబ్సైట్ తెలిపింది. ఈ విషయంపై శ్రద్ధా అభిమానులు కంగారు పడ్డారు.

 

అయితే దీనిపై స్పందించిన శ్రద్ధా శ్రీనాథ్ ఈ విషయాన్ని ఖండించింది. వాస్తవానికి నేను హైదరాబాద్, చెన్నైకి విమాన ప్రయాణం చేశానని, కానీ ప్రయాణికులలో ఎవరికి కరోనా లేదని చెప్పుకొచ్చింది. కర్ణాటక పోలీసులు కానీ, వైద్య అధికారులు కానీ తన ఇంటికి రాలేదని..నా డాక్టర్ ఫ్రెండ్ సూచన మేరకు 14 రోజులు సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నానని చెప్పింది. అంతేకాకుండా మార్చి 29కి 14 రోజులు పూర్తయ్యాయని, ప్రస్తుతం తన తల్లికి వంట గదిలో హెల్ప్ చేస్తున్నానంటూ తెలియజేసింది.  తనపై వస్తున్న తప్పుడు వార్తలను ఆపాలని, ఈ సమయంలో పుకార్లతో కూడా జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఈ విషయం తెలియగానే తన అభిమానులు రిలాక్స్ అయ్యారు. ప్రస్తుతం శ్రద్ధ తెలుగులో ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ తోపాటు తమిళ్ లో రెండు సినిమాలు, కన్నడలో మరో రెండు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: