గత కొంతకాలంగా కమర్షియల్ అంశాలు అంటూ తీసిన సినిమాలనే తిరగేసి తీడం మానేశారు. ఇటు టాలీవుడ్ లోను అటు బాలీవుడ్ లో బయోపిక్స్ అంటూ లేదా కొత్త తరహా కథలతో ఎక్స్‌పరిమెంట్స్ చేస్తున్నారు. వాటిలో కొన్ని బ్లాక్ బస్టర్ అవుతుంటే కొన్ని మాత్రం బెడిసికొడుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో కంటెంట్ బేస్ చేసుకొని తెరకెక్కిస్తున్న కథ లు బాగా వర్కౌట్ అవుతున్నాయి. అంతేకాదు ఈ సినిమాలని తెరకెక్కిస్తున్న దర్శకులకి మంచి డిమాండ్ ఉంటోంది. దాంతో అదే కథ ని మిగతా భాషల్లో రీమేక్ చేయడానికి మేకర్స్ బాగా పోటీ పడుతున్నారు. 

 

ఇప్పటికే తెలుగు, తమిళంలో సూపర్ హిట్ అయిన చాలా సినిమాలను హిందీలో రీమేక్ చేసి సూపర్ హిట్ ని అందుకున్నారు. ఇప్పుడు కూడా ఒక తమిళ సూపర్ హిట్ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన సూపర్ హిట్ సినిమా ఖైదీ ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. తమిళం పాటు తెలుగులో నూ 
డబ్ చేసిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా గత సంవత్సరం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అందుకే ఈ రీమేక్ లో అజయ్ దేవగన్ నటించబోతున్నాడు. 

 

ఇక బాలీవుడ్ మీడియా సమాచారం ప్రకారం అక్టోబర్ ఫస్ట్ వీక్ నుండి ఈ రీమేక్ మూవీ షూటింగ్ ను మొదలవబోతుందట. అంతేకాదు 2021 ఫిబ్రవరి 12న ఈ రీమేక్ విడుదలవుతుందని అజయ్ దేవగన్ అనౌన్స్ కూడా చేశారు. ఇక ఈ సినిమా కథ హిందీ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అవుతుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. రిలయన్స్ ఎంటెర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. అజయ్ దేవగన్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాతో మన తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. మొత్తానికి అజయ్ దేవగన్ ఇటు తెలుగు సినిమాలో చేస్తూనే అటు కోలీవుడ్ సినిమాని బాలీవుడ్ రీమేక్ చేయడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: