తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ అండ్ డైనమిక్ హీరో దేవరకొండ విజయ్ సాయి కొద్దికాలంలోనే చాలా పెద్ద స్టార్ గా ఎదిగాడు. 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమా తో నాని పక్కన ఫుల్ లెంగ్త్ పాత్రలో తన కెరీర్ స్టార్ట్ చేసిన విజయ్ దేవరకొండ 'పెళ్లిచూపులు' సినిమాతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. చిత్రానికి జాతీయ అవార్డు కూడా రావడం గమనార్హం. అయితే విజయ్ ని టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ ని చేసిన చిత్రం మాత్రం కచ్చితంగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన 'అర్జున్ రెడ్డి' నే.

 

అయితే చిత్రం తరువాత కూడా విజయ్ ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాడు. యువ దర్శకులకు ఎప్పుడూ అవకాశాలు ఇస్తూ వారిలోని టాలెంట్ ని ప్రోత్సహిస్తూ తాను కూడా ఎదుగుతూ వచ్చాడు. అయితే మధ్య విజయ్ పరిస్థితి పెద్దగా బాగాలేదు. 'వరల్డ్ ఫేమస్ లవర్' అట్టర్ ఫ్లాప్ కావడంతో అభిమానులు పూరి జగన్నాథ్ తో సినిమా పై అంచనాలు ఒక రేంజిలో పెట్టుకున్నారు. మొట్టమొదటిసారి సీనియర్ డైరెక్టర్ తో సినిమా తీస్తున్న విజయ్ సారి భారీ హిట్ ఆశిస్తున్నాడు.

 

ఇకపోతే ఇదే క్రమంలో విజయ్ మరో సినిమాకి కూడా ఓకే చెప్పినట్లు ఫిలిం నగర్ లో వార్తలు వస్తున్నాయి. పూర్తి మేటర్ లోకి వెళ్తే  "బ్రోచేవారెవరురా" దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించడానికి ఓకే చెప్పినట్లు సమాచారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో వచ్చిన బ్రోచేవారెవరురా సినిమాలో హీరో శ్రీ విష్ణు నటించగా సినిమాకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించింది.  వివేక్ ఆత్రేయ విజయ్ కాంబినేషన్ లో సినిమా అంతా కుదిరితే యేడాది సెకండాఫ్ లో స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: