నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బాలయ్య ఎవరితో సినిమా చేస్తాడు అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. బాలకృష్ణ ఛాన్స్ ఇస్తే నేను అదిరిపోయే సినిమా చేస్తా అంటూ ఈమధ్యనే డైరక్టర్ అనీల్ రావిపూడి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అయితే ఆ సినిమాలో మోక్షజ్ఞ కూడా ఉండేలా స్క్రిప్ట్ రాస్తానని అంటున్నాడు. ఇదిలాఉంటే బాలకృష్ణతో పైసా వసూల్ సినిమా చేసిన పూరి జగన్నాథ్ మళ్ళీ బాలయ్యతో సినిమాకు రెడీ అంటున్నాడు. పైసా వసూల్ రిలీజ్ టైం లోనే బాలకృష్ణతో త్వరలోనే మరో సినిమా ఉంటుందని అన్నాడు పూరి. 

 

అయితే ఆ సినిమా కూడా పెద్దగా ఆడలేదు కాబట్టి ఆ కాంబినేషన్ పై అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. అయితే బాలయ్య బాబుతో తాను మరో సినిమా చేస్తా అంటున్నాడు పూరి. ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ చేశానని బాలయ్యను కలిసి వినిపించి.. ఆయన ఒకే అంటే సినిమా చేస్తా అంటున్నాడు పూరి జగన్నాథ్. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకుని మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన పూరి ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత పూరి తప్పకుండా బాలకృష్ణతో సినిమా చేస్తాడని అంటున్నారు. 

 

ఈసారి పూరి బాలకృష్ణ కోసం డిఫరెంట్ స్టైల్ స్క్రిప్ట్ రాసుకున్నాడట. పైసా వసూల్ తో అంచనాలు అందుకొని పూరి ఈసారి మాత్రం టార్గెట్ మిస్ అవకుండా జాగ్రత్త పడుతున్నాడట. విజయ్ దేవరకొండ ఫైటర్ మూవీ రిలీజ్ తర్వాత బాలకృష్ణ సినిమా అప్డేట్ తెలుస్తుంది. విజయ్ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నాడు పూరి. పూరితోనే కాదు అనీల్ రావిపూడితో కూడా సినిమా చేసేందుకు బాలకృష్ణ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తెలుస్తుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: