సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ ఇప్పుడు తన అభిమానులకు మరింత దగ్గరగా ఉండేందుకు టిక్ టాక్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇండియాలో టిక్ టాక్ ఫాలోవర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.టిక్ టాక్ ద్వారా చాలామంది ఫేమస్ అయ్యారు. లేటెస్ట్ గా త్రిష తన సర్ ప్రయిజ్ ఎంట్రీతో అందరికి షాక్ ఇచ్చింది. ఒక సాంగ్ కు డ్యాన్స్ చేస్తూ మొదటి టిక్ టాక్ వీడియో పెట్టింది త్రిష. టిక్ టాక్ లో కొంతమంది టాలెంట్ చూస్తే వీళ్లకు మంచి భవిష్యత్తు ఉందని అనిపిస్తుంది. ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉన్న వారు కూడా టిక్ టాక్ ద్వారా తమ టాలెంట్ బయటపెడుతున్నారు. 

 

ఆల్రెడీ స్టార్ హీరోయిన్ అయినా త్రిషకు టిక్ టాక్ తో ఏం పని అనుకోవచ్చు.. తనలోని చిలిపి తనాన్ని బయట పెట్టేందుకు త్రిష టిక్ టాక్ లోకి ఎంటర్ అయ్యింది. మొదటి వీడియోలోనే తన టాలెంట్ చూపించింది అమ్మడు. తెలుగులో పెద్దగా అవకాశాలు లేని త్రిష కోలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలు చేస్తుంది. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య నుండి ఎగ్జిట్ అయ్యింది త్రిష.. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చిందని చెప్పింది త్రిష. 

 

ఇదిలాఉంటే లాక్ డౌన్ టైం లో ఫుల్ బోర్ గా ఫీల్ అవుతున్న త్రిషకు అల్లు అర్జున్, రానా కంపెనీ ఇస్తున్నారట. వాళ్ళిద్దరితో త్రిష వీడియో కాల్ లో తరచూ మాట్లాడుతుందని తెలుస్తుంది. ఇంకా బోర్ కొడుతుందనే టిక్ టాక్ లోకి వచ్చింది త్రిష. ఇక ఇక్కడ వీడియోలు చేస్తూ వాటికి వచ్చే రెస్పాన్స్ చూసి బాగా టైం పాస్ అయ్యేలా చేసుకుంది అమ్మడు. తమిళంలో 96 మూవీతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన త్రిష అక్కడ వరుస సినిమాలు చేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: