ఈ ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. మహేష్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన సరిలేరు నీకెవ్వరు తరువాత మహేష్ చేయబోయే సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రమోషన్ సందర్భంగా తన తదుపరి చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఉంటుందని ఎనౌన్స్ చేశాడు మహేష్.
అయితే తరువాత ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. దీంతో మహేష్ నెక్ట్స్ మూవీపై రకరకాల వార్తలు విపిస్తున్నాయి. చాలా కాలంగా చర్చల్లో ఉన్న పరశురామ్ సినిమాను సెట్స్ మీదకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు మహేష్. గీత గోవిందం లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత మహేష్ హీరోగా ఓ సినిమాను ప్లాన్ చేశాడు పరశురామ్. అయితే కొద్ది రోజుల చర్చల తరువాత ఆ ప్రాజెక్ట్ ను హోల్డ్ లోపెట్టాడు మహేష్.
ఇప్పుడు అదే సినిమాను సెట్స్ మీదకు తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నాడట. అంతేకాదు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మహేష్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీని తీసుకునే ఆలోచనలో ఉన్నారట. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కబోయే ఈ సినిమాలో హీరోయిన్గా సారా అలీఖాన్ను తీసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన భామ సారా. ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ సినిమా ఈ భామ మహేష్ కు జోడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తే ఆమె, రేంజ్ మార్కెట్ భారీగా పెరుగుతుందని భావిస్తున్నారు విశ్లేషకులు.