సీనియర్ హీరో వెంకటేష్ ఎఫ్ 2 చిత్ర విజయంతో ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు. ఆ చిత్రం వందకోట్ల షేర్ సాధించడంతో వెంకీకి ఉత్సాహం వచ్చింది. దాంతో నాగచైతన్య, వెంకటేష్ కలిసి నటించిన వెంకీమామా చిత్రాన్ని భారీ బడ్జెట్ లో తెరకెక్కించారు. ఈ చిత్రం కూడా మంచి విజయమే సాధించింది. అయితే ప్రస్తుతం వెంకీ నారప్ప అనే సినిమాలో నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే.

 

తమిళ చిత్రమైన అసురన్ ని తెలుగులో నారప్పగా రీమేక్ చేస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ తో సినిమా మీద ఆసక్తి కలిగించాడు. ఈ ఫస్ట్ లుక్ లో వెంకీ చాలా ఇంటెన్స్ లుక్ లో కనిపించాడు. అప్పటి దాకా రీమేక్ ఏం చూస్తాం అన్నవారు కూడా వెంకీ లుక్ చూసిన తర్వాత తప్పకుండా చూడాలి అనుకునేలా చేసింది.

 


అయితే నారప్ప కోసం వెంకీ తన రెమ్యునరేషన్ ని పెంచినట్లు వార్తలు వచ్చాయి. దాదాపుగా మిడ్ రేంజ్ హీరోల కంటే కొంచెం ఎక్కువ తీసుకునే వెంకటేష్ ఒక్కసారిగా స్టార్ హీరోకి ఇచ్చేంత డిమాండ్ చేసాడని అన్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ వార్తల్లో నిజం లేదట. నారప్ప సినిమాకి వెంకీ అసలు రెమ్యునరేషన్ తీసుకోవట్లేదట. పారితోషికాన్ని వద్దని సినిమా రిలీజ్ అయ్యాక షేర్ తీసుకోవాలని అనుకుంటున్నాడట.

 

ఇప్పుడు చాలా మంది హీరోలు సినిమా ప్రొడక్షన్ పై ఎక్కువ భారాన్ని వేయకుండా పారితోషికాన్ని తగ్గించుకుని లాభాల్లో వాటా తీసుకుంటున్నారు. ఇప్పుడు వెంకీ కూడా ఈ లిస్ట్ లో చేరిపోయాడని సమాచారం . సినిమా బాగా రావడానికి డబ్బుని ఖర్చు పెట్టి లాభంగా వచ్చిన దాన్ని పంచుకోవడం వల్ల నిర్మాతలు సినిమాలు తీయడానికి ముందుకువస్తున్నారు. ఏది ఏమైనా మొత్తానికి వెంకీ రెమ్యునరేషన్ పెంచాడని వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: