కరోనా ప్రభావం దేశవ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ మేరకు ప్రభుత్వాలు కీలక నిర్ణయాలను తీసుకుంది.. జనతా కర్ఫ్యూ పేరుతో ప్రభుత్వాలు ప్రజలను హౌజ్ అరెస్ట్ చేశారన్న సంగతి తెలిసిందే.. అయితే తెలుగు రాష్ట్రాలకు ఎందరో మహనీయుల విరాళాలను అందిస్తున్నారు.. ఇప్పటికే. పలువురు ప్రముఖులు ఆర్థిక సాయాన్ని అందించారు... మరి కొందరేమో పేదలకు స్వయంగా భోజనం, అలాగే కరొనను ఎదుర్కొనే పరికరాలను అందజేస్తున్నారు.
ఇప్పటికే చాలా మంది సెలెబ్రెటీలు విరాళాలు అందించారు.. అయితే లాక్ డౌన్ కారణంగా సినిమా వాయిదా పడ్డాయి.. ఇకపోతే కరోనా ప్రభావం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పెద్ద హీరోల సినిమాల విడుదలకు చుక్కెదురై పరిస్థితి కొనసాగుతుందని సినిమా వర్గాల్లో బలంగా వినపడుతుంది.. ముఖ్యంగా పర్యాటక రంగం సినీ రంగం మీద దీని ఎఫెక్ట్ ఎక్కువగా పడింది.
తెలుగు చిత్ర సీమలోని సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.. ఈ మేరకు దొరికిన ఈ కొద్దీ సమయాన్ని వృధా చేయకుండా వారికి తెలిసిన గతంలో వారు నేర్చుకున్న పనులపై శ్రద్ద చూపిస్తూ వస్తున్నారు. అయితే వారు ఇన్ కూర్చొని ఏదైతే చేశారో వాటిని సోషల్ మీడియాలో అభిమానులకు షేర్ చేస్తూ వస్తున్నారు. వారిని ఇంట్లో కూర్చుని మీకు నచ్చిన దానికి చేయాలనీ పిలుపునిస్తున్నారు.
ఇకపోతే నిన్న శ్రీరామనవమి సందర్బంగా అందరు సినీ తారలు ఇంట్లోనే పండుగను జరుపుకొంటూ అభిమానులకు శుభాకంక్షాలు తెలిపారు. ఇక శ్రీరామనవమి సందర్బంగా ఇంట్లో పూజాకార్యక్రమాలని ముగించుకున్న యాంకర్ సుమ.. ఇంట్లో పులిహోర కలుపుతున్నట్లు ఓ వీడియో ను తీసి సోషల్ మీడియాలో వీడియో ను పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవ్వడమే కాకుండా షేర్, లైకులతో దూసుకుపోతుంది..