కరోనా పై పోరుకు టాలీవుడ్ నుండి  భారీగా విరాళాలు వస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా టాప్ హీరోలు ,ప్రముఖ నటీనటులు కరోనా నిర్ములనకు విరాళాలను ప్రకటిస్తున్నారు. ఈ జాబితాలో తాజాగా అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ కూడా చేరాడు. ఈరోజు బాలయ్య 1.25లక్షల విరాళాన్ని ప్రకటించాడు. అందులో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 50లక్షల చొప్పున విరాళం ఇవ్వగా సినీ కార్మికలను ఆదుకోవడానికి ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) కి  25 లక్షలు విరాళంగా ఇచ్చాడు. 
 
 
ఈ సందర్బంగా బాలయ్య పై ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించాడు మెగాస్టార్ చిరంజీవి. కష్ట సమయాల్లో ఎల్లప్పుడు ప్రజలను ఆదుకోవడానికి  మీరెప్పుడు తోడుంటారని చిరు ట్వీట్ చేశాడు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీ కి పెద్ద దిక్కుగా మారిన చిరంజీవి..సీసీసీ ని ఏర్పాటు చేసి  విరాళాలను సేకరిస్తున్నాడు. ఇప్పటికే ఈ చారిటీ కోసం చిరంజీవి ,నాగార్జున , మహేష్ బాబు ,ప్రభాస్ , రవితేజ, ఎన్టీఆర్ ,నాగ చైతన్య తదితరులు  భారీగా విరాళాలను ప్రకటించారు. ఇప్పటివరకు సీసీసీ కి మొత్తంగా  7 కోట్ల వరకు విరాళాలు అందాయని సమాచారం. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: