బాలీవుడ్ హాట్ కపుల్ అలియా భట్, రణబీర్ కపూర్ లకు సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. చాలా కాలంగా డేటింగ్ లో ఉన్న ఈ జంట ఇటీవల కరోనా లాక్ డౌన్ కారణంగా ఒకే ఇంట్లో ఉంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య రణబీర్ పెంపుడు కుక్కతో కలిసి అలియా, రణబీర్ లు కలిసి బయటకు తీసుకువచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తాజాగా మరోసారి అలియా, రణబీర్ రిలేషన్ చర్చకు వచ్చింది. లాక్ డౌన్ కారణంగా సినిమా తారలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ హీరోయిన్ కరిష్మా కపూర్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ అలియా, రణబీర్ ల వ్యవహారం తెర మీదకు వచ్చింది. కరీష్మా చిన్నతనంలో దిగిన తన ఫ్యామిలీ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలో కరినా కపూనర్, రణబీర్, రిధిమా లతో పాటు గ్రాండ్ పేరెంట్స్ రాజ్ కపూర్, కృష్ణ రాజ్ కపూర్లు కూడా ఉన్నారు.
ఈ రోజు ఫ్లాష్ బ్యాక్ ఫ్రైడేలో భాగంగా కరిష్మా ఈ ఫోటోను పోస్ట్ చేసింది. అయితే ఈ ఫోటోపై సెలబ్రిటీల కూడా స్పందించారు. ముఖ్యంగా రణబీర్ గర్ల్ ఫ్రెండ్, యంగ్ హీరోయిన్ అలియా భట్ చేసిన కామెంట్ ఆసక్తికరంగా మారింది. ఈ ఫోటో కామెంట్ సెక్షన్లో రెడ్ హార్ట్ సింబల్స్ ను పోస్ట్ చేసింది అలియా. దీంతో రణబీర్ మీద ఉన్న ప్రేమ కారణంగానే అలియా ఇలా రిప్లై ఇచ్చిందని భావిస్తున్నారు నెటిజెన్లు.