ఇంటర్నెట్ మూలంగా ఈ రోజుల్లో అందరిలోనూ కిలోల కొద్దీ ఉంది టాలెంట్.. వాటిలో ఫోటో ఎడిటింగ్ అనేది ఒక కళ.. ప్రస్తుత ట్రెండ్లో మేకప్ వేసుకోకపోయినా అందంగా కనిపించేందుకు అవసరమయ్యే ఎన్నో లేటెస్ట్ యాప్స్, ఫీచర్స్ కలిగిన ఫోన్లు మార్కెట్లో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఇక ఏ ఫోటో పోస్ట్ చేయాలన్నా దానికి కాస్తంత ఎడిటింగ్ చెయ్యనిదే సోషల్ మీడియాలో అప్లోడ్ చేయట్లేదు చాలా మంది. సెలబ్రిటీలు దీనికేం మినహాయింపు కాదండోయ్. తాజాగా అంకితా కోన్వార్ పోస్ట్ చేసిన ఫోటో ఈ వార్తలకు ఉదాహరణగా చెప్పవచ్చు.
కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు తమ అప్డేట్స్తో సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్ భార్య అంకితా కోన్వార్ కొత్తగా ఏదైనా చేయాలనుకుని గతేడాది బికినీలో తీసుకున్న పాత ఫోటోను అభిమానులతో పంచుకుంది. అయితే పోయిన సంవత్సరం వేసవి కాలానికీ ఇప్పటి సమ్మర్కు పరిస్థితులు ఎంతగానో మారిపోయాయని చెబుతూ..‘‘గతేడాది వేసవిని ఎంజాయ్ చేసాం. ఇప్పుడు దానికి కంప్లీట్ డిఫరెంట్గా ఉంది పరిస్థితి. ఎటువైపు వెళుతున్నామో..’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ బికినీతో ఉన్న పిక్ షేర్ చేసింది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో అందర్నీ ఆకర్షిస్తోంది.
‘స్కిన్టోన్ కాంతివంతంగా కనిపించడానికి ఫోటోను అంతలా ఎందుకు ఎడిట్ చేశారు? మీ చామన ఛాయ రంగే మాకు నచ్చుతుంద’’ని ఒక ఔత్సాహికుడైన నెటిజన్ కామెంట్ చేయగా.. ‘‘ఇది కేవలం ఫిల్టర్ హనీ..’’ అంటూ స్వీట్ గా రిప్లై ఇచ్చిందామె. క్వారంటైన్ వేళ ఆమె తన భర్తతో కలిసున్న ఫోటోలను సైతం పంచుకుంటూ అభిమానులతో నిత్యం టచ్లో ఉంటోంది. ఇక వయసు పరంగా చాలా వత్యాసం ఉన్న మిలింద్, అంకితా తమ మధ్య ప్రేమలో మాత్రం ఎటువంటి తేడా ఉండదు అంటున్నారు.