మళయాళ భామ కీర్తి సురేష్ పెళ్లంటూ వస్తున్న వార్తలు ఆమె అభిమానులను షాక్ అయ్యేలా చేస్తున్నాయి. కేరళకు చెందిన ఒక బిజినెస్ మెన్ ను కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతుందని నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిప్పులేనిదే పొగరాదు.. అందునా నేషనల్ మీడియా కవరేజ్ అంటే ఏదో ఒక క్లూ దొరికే ఉంటుంది. మలయాళంలో స్టార్ హీరోయిన్ అయిన కీర్తి సురేష్ తెలుగులో నేను శైలజ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. 

 

మహానటి తర్వాత సౌత్ లోనే కాదు నేషనల్ వైడ్ గా కీర్తి సురేష్ క్రేజ్ పెరిగింది. కీర్తి సురేష్ ఫాదర్ మళయాళంలో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సురేష్ కు పొలిటికల్ గా కూడా పలుకుబడి ఉంది. అందుకే ఒక బడా బిజినెస్ మెన్ తో కీర్తి సురేష్ పెళ్లి ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ లో కీర్తి సురేష్ ఎంగేజ్మెంట్ ఉంటుందని కేవలం క్లోజ్ మెంబర్స్ మాత్రమే ఈ ఈవెంట్ కు అటెండ్ అవుతారని తెలుస్తుంది. కీర్తి సురేష్ పెళ్లి వార్తా విన్న ఆమె ఫ్యాన్స్ అప్పుడే పెళ్లేంటి అంటూ అవాక్కవుతున్నారు. 

 

అయితే ఈ వార్తలపై కీర్తి సురేష్ ఫ్యామిలీ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఒకవేళ ఈ వార్తా నిజంగా రూమర్ అయితే కీర్తి సురేష్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. తెలుగులో ప్రస్తుతం మిస్ ఇండియా సినిమా చేస్తున్న కీర్తి సురేష్, నితిన్ తో రంగ్ దే సినిమాలో నటిస్తుంది. మహేష్ పరశురామ్ కాంబినేషన్ లో  కీర్తిని తీసుకునే ఆలోచనలో ఉన్నారట. అయితే మరోపక్క బాలీవుడ్ భామ కియారా అద్వానీకి ఛాన్స్ ఇచ్చే సూచనలు ఉన్నట్టు తెలుస్తుంది. ఆ ఇద్దరిలో ఎవరు ఓకే అయినా మహేష్ ఫ్యాన్స్ కు పండుగే అని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: