కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే.. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు దేశ దేశాలను కలపెట్టడమే కాకుండా ప్రపంచంలో అందరినీ నిద్రలేని రాత్రులను గడిపెలా చేస్తుంది .. అందుకే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దేశాలు ఒక్కటై కరోనా ను నియంత్రణ చేసున్నాయి.. భారత ప్రభుత్వం ఈ కరోనా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంది.. కరోనా ప్రభావం ప్రజలను వారి జీవన శైలిని హతలకుతలం చేసేసింది.. 

 

 

 

 

కరోనా ను కట్టడి చేయడానికి ఏప్రిల్ 14 వ తేదీ వరకు లాక్ డౌన్ ను ప్రకటించింది..ఈ మేరకు ప్రజలు ఎక్కడా బయట తిరగడం లేదని అర్థమవుతుంది.. ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు.. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న సినిమాలు వాయిదా పడ్డాయి.. విడుదల సినిమాలు కూడా వాయిదా పడిన సంగతి తెలిసిందే.. 

 

 


 ఇకపోతే ఇప్పుడు సినిమాలు చిత్రీకరణ పూర్తి చేసుకుంటున్న సినిమాలు ఇంట్లోనే ఉంటూ డబ్బింగు పనులు పూర్తి చేసుకుంటున్నాయి.. సాప్ట్ వేర్ ఉద్యోగులకు మాత్రమే కాదు ..సినీ ప్రముఖులకు కూడా ఈ భాధలు తప్పడం లేదు..కరోనా ప్రభావం తో సినిమా షూటింగ్ లు ఎక్కడిక్కడ నిలిచిపోయిన సంగతి తెలిసిందే..మరో విషయమేంటంటే సినీ స్టార్స్ ఇంటికే పరిమితమయ్యి పనులు చేస్తున్నారు. 


 

 

 

కట్టుకున్న భర్త అని కూడా చూడకుండా ఓ ప్రముఖ హీరోయిన్ భర్త తో  అంట్లు తోమిచ్చింది.. ఇంతకీ ఆమె ఎవరంటే  వైవిధ్యమైన పాత్రల్లో నటించి యువతలో మంచి క్రేజ్ ను  అందుకున్న శ్రీయ శరన్ .. దేశవ్యాప్తంగా లాక్ కొనసాగుతున్న నేపథ్యంలో అందరు ఇళ్లకే పరిమితమయ్యారు..సినిమా షూటింగ్ లు లేని కారణంగా భార్యలు, భర్తలు ముక్కుపిండి ఇంట్లో పనులు  చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ నటి శ్రీయ శరన్ తన భర్తతో ఇంట్లో అంట్లు తోమించింది.పెళ్లైన మగాళ్లందరికీ సవాల్ విసిరింది. ఇంట్లో ఎవరెవరు తమ భార్యలకు ఇంటి పనుల్లో సాయం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తుంది. తన ఇంట్లో అయితే భర్త ఆండ్ర్యూ గిన్నెలు తోముతున్నాడంటూ వీడియో పోస్ట్ చేసింది.అలాగే  భర్త బాగా పనిచేస్తాడంటూ అతనికి ముద్దులతో పొగుడుతూ వచ్చింది. ఈ ఛాలెంజ్ కు  ఎవరు నెక్స్ట్ బలవుతారో చూడాలి మరి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: