కరోనా కోరలు చాచింది. అందరూ భయ భ్రాంతులతో గడగడలాడిపోతున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్త్రం ఆర్.ఆర్.ఆర్. గతంలో ఆయన తీసిన బాహుబలి చిత్రంతో పోల్చుకుంటే అప్పట్లో ఆ చిత్రం ఎంత కలెక్షన్లను కొల్లగొట్టిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఇప్పుడు ఈ చిత్రం కూడా దాంతో పోల్చుకుంటే అంతకన్నా ఎక్కువ కలెక్షన్లే వస్తాయని ఆశించిన వీళ్ళ ఆశలన్నీ అడిఆశలే అని చెప్పాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవ్వూ థియేటర్ల మొహం కూడా చూసేలా లేరు. ఇక ఎంత ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయి దాదాపు సంవత్సరం టైమ్ ఉన్నప్పటికీ గతంతో పోల్చుకుంటే ఆశించినంత ఫలితం అయితే దక్కదేమో అన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే రాజమౌళి గతంలో చరణ్తో కలిసి మగధీర తీశాడు అది సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే ఎన్టీఆర్తో కలిసి యమదొంగ,సింహాద్రి తీసిన క్రేజ్ ఒకటి సో ఇవి రెండూ కలిపి బాహుబలిని బీట్ చేసే సినిమా తీయాలి అనుకునే రాజమౌళి వీరిద్దరినీ కలిపి మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేశాడు. బాహుబలి చిత్రం మంచి హిట్ అయిన క్రేజ్ని బట్టి వీళ్ళద్దరితో విడి విడిగా సినిమా తీసిన జక్కన్న ఇప్పుడు కలిసి మూవీ తీస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ప్రతిదీ రాజమౌళి చూడాలనుకున్నాడు. కాబట్టి ఈ సినిమాకి దాదాపు 1500 కట్ల నుంచి 2000 వరకు బిజినెస్ చెయ్యాలనుకున్నాడు. ఆర్.ఆర్.ఆర్ స్ట్రాటజీకి కరోనా ఎఫెక్ట్ గట్టిగా పడింది.
డిస్ట్రిబ్యూషన్ నుంచి అన్ని రకాలుగానూ ఎఫెక్ట్ పడింది. వేరే భాషల్లో కూడా ఈ చిత్రాన్నిరిలీజ్ చేస్తున్నారు. దాంతో ల్యాంగ్వేజస్ మీద కూడా బాగా ఎఫెక్ట్ పడింది. కేవలం కరోనా వల్లే ఇండివిడ్యూవల్గా కూడా అన్ని ల్యాంగ్వేజస్ మీద ఎఫెక్ట్ పడింది. ఈ చిత్రం డబ్బింగ్ అవుతుంది కాబట్టి. దాంతో వేరే భాషల్లో ఇప్పుడున్న పరిస్ఇతులకి డబ్బింగ్ సినిమాకి అంత పెట్టి కొనాలా అన్న క్వశ్చనింగ్ వస్తుంది. శాటిలైట్ బిజినెస్ కూడా ముందు ఉన్నదానికి ఇప్పటికీ అన్నీ ఈక్వేషన్స్ అనేవి బాగా మారిపోతాయి. అలాగే దీంతో చరణ్ది, రాజమౌళిది వీళ్ళ రెమ్యూనరేషన్లు కూడా తగ్గే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయని చెప్పాలి.