ఎప్పుడూ చలాకీగా కనిపించే బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తల్లిదండ్రులపై బెంగ పెట్టుకుందంట. అదే సమయంలో ఆమె తల్లిదండ్రులు కూడా ఆమెపై కొంత ఆందోళనగా ఉన్నారట. ఇదంతా చెప్పింది ఎవరో కాదు..ఫెర్నాండేజే. శ్రీలంకకు చెందిన ఫెర్నాండేజ్ బాలీవుడ్లో మంచి హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ మంచి ఆఫర్లతో కెరీర్ పరంగా మంచి స్వింగ్లోనే ఉందని చెప్పాలి. ఇక వృత్తిరీత్య ముంబైలో సెటిలైపోయిన ఈ అందాల ముద్దుగుమ్మ ఒంటరిగానే ఉంటోంది. ఇక తల్లిదండ్రులు మాత్రం శ్రీలంకలోని బహ్రెయిన్లోనే ఉంటారట. కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం లాక్ డౌన్ విధిస్తూ విమాన ప్రయాణాలను కూడా నిషేధం అమల్లోకి తెచ్చింది. అయితే శ్రీలకంలో కూడా కరోనా ప్రభావం కాస్త గట్టిగానే ఉండటంతో ఫెర్నాండేజ్ తన తల్లిదండ్రుల ఆరోగ్యంపై కొంత ఆందోళన వ్యక్తం చేస్తోందంట. ఇటీవల ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తల్లిదండ్రులకు తోడుగా ఉంటే బాగుంటుంది. ‘ఇలాంటి పరిస్థితుల్లో నా తల్లిదండ్రులు నాతో ఉంటే బాగుండేదనిపిస్తుంది నేను ఇక్కడ ఒక్కదానినే ఉన్నానని వాళ్లు కూడా నా గురించి ఆందోళన చెందుతున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులతో కలిసి ఉన్నా వారందరూ ఎంతో అదృష్టవంతులు. పెద్దవాళ్లకు ఇప్పుడు మన ప్రేమాభిమానా లు ఎంతో అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లకి మనం తోడుగా ఉండాలి.’ అని జాక్వెలిన్ తెలిపారు.ఇక లాక్డౌన్ గురించి మాట్లాడుతూ ముందు కరోనా గురించి తక్కువ అంచనా వేసినా ఇప్పుడు మాత్రం భయమేస్తోందని పేర్కొంది. ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ‘ప్రస్తుతం సమాజంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది. లాక్డౌన్ మొదటివారం నాకెంతో భారంగా అనిపించింది. సినిమా సెట్స్కి వెళ్లలేను కాబట్టి సోషల్మీడియా వేదికగా నా అభిమానులతో టచ్లో ఉన్నాను.’ అంటూ పేర్కొంది.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple