స్టార్ హీరోల సినిమా టీజర్ కు వచ్చే వ్యూస్, లైకులకు నుండి రిలీజ్ తర్వాత వచ్చే వసూళ్ల వరకు రికార్డుల గురించి చర్చిస్తారు. ఏ చిత్రపరిశ్రమలో అయినా మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ఫ్యాన్స్ గొడవ కామనే. ఈ సంక్రాంతికి రిలీజైన సూపర్ స్టార్ మహేష్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలు పోటీ పడ్డాయి. అయితే బాక్సాఫీస్ వసూళ్ళలో మహేష్ కన్నా బన్ని పైచేయి సాధించాడు. సరిలేరు నీకెవ్వరు కూడా సూపర్ హిట్ అయ్యింది. 

 

కలక్షన్స్ లో సత్తా చాటినా బుల్లితెర మీద తన సత్తా బాహుబలి 2ని రికార్డులను సైతం బ్రేక్ చేశాడు సూపర్ స్టార్ మహేష్. స్మాల్ స్క్రీన్ పై మహేష్ మరోసారి తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు. లాక్ డౌన్ పిరియడ్ లో ఉగాది సందర్భంగా స్మాల్ స్క్రీన్ లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు 23.47 టి.ఆర్.పి రేటింగ్ తో దుమ్ముదులిపేసింది. అయితే అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా ఇంకా బుల్లితెర మీద టెలికాస్ట్ రాలేదు. మహేష్, అల్లు అర్జున్ ఇద్దరి మధ్య సినిమా వసూళ్లతోనే పోటీ ముగిసిందని అనుకున్నారు. కానీ మహేష్ అల్లు అర్జున్ ల ఫైట్ ముగియలేదని తెలుస్తుంది. 

 

వెండితెర మీద మహేష్ సరిలేరు నీకెవ్వరుని క్రాస్ చేసి రికార్డ్ కలక్షన్స్ సాధించిన అల వైకుంఠపురములో స్మాల్ స్క్రీన్ పై కూడా సరిలేరు నీకెవ్వరు సినిమా రికార్డ్ బ్రేక్ చేస్తుందా లేదా అన్నది చూడాలి. లాక్ డౌన్ టైం.. అందులోనూ సినిమా వచ్చి రెండు నెలలే అవుతున్న సందర్భంగా మహేష్ సినిమాను అందరు చూశారు. మరి అల్లు అర్జున్ సినిమాకు అలంటి ఛాన్స్ వస్తుందో లేదో చూడాలి. బాహుబలి 2కి సాధ్యం కానిది అల వైకుంఠపురములోకి సాధ్యమవుతుందా అన్నది డౌట్ గానే ఉంది. 
 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: