ఇటీవలే ఇండస్ట్రీకొచ్చి 15 ఏళ్ళు అయినందుకు అనుష్క కోసం గ్రాండ్ ఈవెంట్ ని నిర్వహించారు తాజా చిత్ర బృందం కోనా వెంకట్ టీం. సూపర్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది అనుష్క శెట్టి. అయితే ఆ రోజు మేకప్ వేసుకున్నప్పుడు .. అనుష్క ఇంత పెద్ద స్టార్ అవుతుందని తనని పరిచయం చేసిన డైరెక్టర్ పూరి జగన్నాధ్ గాని, హీరో అక్కినేని నాగార్జున గాని ఊహించి ఉండరు. ఇక టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి తోను సినిమాలు చేసిన అనుష్క పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కి సంబంధిన ప్రతీ విషయలలో మాత్రం ఎప్పుడు హాట్ టాపిక్ అవుతుంటుంది. ముఖ్యంగా ఆయన పెళ్ళి విషయం. అయితే ఇవన్ని ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తను చేసుకుపోతుంది స్వీటి అనుష్క. 

 

ఇక కెరీర్ ప్రారంభం లో గ్లామర్ పాత్రల్లో నటించిన అనుష్క ప్రభాస్ హీరోగా వచ్చిన బిల్లా లో బికిని వేసి కాక రేపింది. రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్స్, గ్లార్ డోస్ తో ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకోవడమే కాదు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ను క్రేజ్ ని దక్కించుకుంది. ముఖ్యంగా ప్రభాస్ నాగార్జున, గోపీచంద్, మహేష్ బాబు లాంటి ఆరడుగుల హీరోలకి సరిగ్గా సరిపొయో జోడి అండ్ ఛాయిస్ అనుష్క అన్న టాక్ బాగా సంపాదించుకుంది. ఇక అనుష్క శత చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి సినిమా మైల్ స్టోన్ అని చెపాలి. ఈ సినిమాతో అనుష్క కి వచ్చిన క్రేజ్ ఇండస్ట్రీలో ఏ ఒక్కరు ఊహించలేదు. అదే అనుష్క కెరీర్ మొత్తాన్ని మార్చేసింది. ఎలాంటి సందర్భం వచ్చినా అనుష్క ఖచ్చితంగా గుర్తు చేసుకునేది అరుంధతి సినిమానే.


 
ఇక ఈ సినిమాతోనే టాలీవుడ్ లో లేడి ఓరియొంటెడ్ చిత్రాలను ఎక్కువగా చేసింది. ఈ సినిమా తర్వాత ఎక్కువగా అనుష్క కోసం మాత్రమే దర్శక, నిర్మాతలు కథలు తయారు చేయించారు. అలా కేవలం అనుష్క ని దృష్ఠిలో పెట్టుకొని తయారు చేసిన కథే సైజ్ జీరో. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ ఈ సినిమాకోసం అనుష్క ని ఎంచుకొని పెద్ద ప్రయోగం చేశారు. అయితే అది అనుష్క కెరీర్ నే మార్చేసింది. ఈ సినిమాకోసం లావెక్కి చేసిన ప్రయోగం తో అనుష్క సినిమా కెరీర్ చిక్కుల్లో పడింది. కేవలం ఒక్క సైజ్ జీరో సినిమా వల్ల అనుష్క కెరీర్ లో చాలా సినిమాలు మిస్సయ్యాయంటే ఈ సినిమా అనుష్క కెరీర్ ని ఎంతగా కిందకి లాగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పటి నుంచి అలాంటి సినిమాలు చేయకూడని అనుష్క గట్టిగా నిర్ణయించుకుందని తాజాగా వార్తలొస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: