టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దేవాదాయ శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాల కథాంశం నేపథ్యంలో పలు కమర్షియల్ హంగులతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు టాక్. అలానే ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యణ్ యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ సినిమా చేస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ హీరోగా వచ్చిన పింక్ అనే కోర్ట్ డ్రామా మూవీ కి అధికారిక రీమేక్ గా తెరక్కుతున్న ఈ సినిమాలో పవర్ స్టార్ ఒక పవర్ఫుల్ లాయర్ పాత్రలో నటిస్తున్నారు. ఇకపోతే అతి త్వరలో తాను త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు ఇటీవల రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన వినయవిధేయ రామ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి తెల్పడం జరిగింది. 

 

అయితే కొద్దిరోజులుగా ప్రచారం అవుతున్న వార్తలను బట్టి చూస్తుంటే, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ సినిమా వర్కౌట్ అవడం కష్టం అని సమాచారం. అయితే ఆ సినిమా స్థానంలో మెగాస్టార్, పవర్ స్టార్ కలయికలో కళాబంధు సుబ్బరామిరెడ్డి నిర్మాతగా త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోయే సినిమా ఉంటుందని అంటున్నారు. వాస్తవానికి కొద్దిరోజుల క్రితం తాను చిరు, పవన్ లతో కలిసి త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక భారీ మల్టీస్టారర్ మూవీని నిర్మించబోతున్నట్లు మీడియా కు తెలిపారు సుబ్బరామి రెడ్డి. 

 

అయితే ఎట్టకేలకు ఆ సమయం అతి త్వరలో రానుందని సమాచారం. అతి త్వరలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయనున్న త్రివిక్రమ్, ఇప్పటికే దాని తరువాత సూపర్ స్టార్ మహేష్ తో చేయబోయే సినిమా కథపై వర్క్ చేస్తున్నారని, అలానే దాని అనంతరం మెగాస్టార్, పవర్ స్టార్ కలయికలో ఆయన సినిమా ఉండనుందని నేడు పలు టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇదంతా జరగడానికి మరొక ఏడాదికి పైగా పడుతుందని, ఈలోపు చిరు, పవన్ కూడా తమ కమిట్మెంట్స్ ని పూర్తి చేసుకుని సిద్ధం అవుతారని, అప్పుడు మంచి ముహూర్తాన ఈ సినిమా ప్రారంభం కానుందని అంటున్నారు. అయితే ఈ సినిమాపై పూర్తి క్లారిటీ వచ్చినట్లుగా ఎక్కడా అధికారికంగా సమాచారం లేనప్పటికీ, ఒకవేళ ఇదే కనుక నిజం అయితే మాత్రం బాక్సాఫీస్ రికార్డ్స్ అన్ని కూడా బద్దలే అని చెప్పకతప్పదు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: