‘అల వైకుంఠపురములో’ మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి సినిమాను జూనియర్ ఎన్టీఆర్ తో ఖరార్ చేయడమే కాకుండా ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడ విడుదల చేసారు. తారక్ కెరియర్ కు సంబంధించి 30వ సినిమాగా రూపొందే ఈ మూవీ కథ ఫైనల్ అవ్వడమే కాకుండా ఈ మూవీని సెప్టెంబర్ లో మొదలుపెట్టి వచ్చే ఏడాది సమ్మర్ రేస్ కు విడుదల అయ్యేలా ప్లాన్ కూడ చేసారు. 


అయితే ఈ మూవీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవుతుంది అంటూ కొన్ని గాసిప్పులు హడావిడి చేయడం మొదలుపెట్టాయి. దీనికి కారణం ప్రస్తుతం షూటింగ్ లు లేకపోవడంతో వాయిదా పడ్డ ‘ఆర్ ఆర్ ఆర్’ అంటూ ఒక ప్రచారం మొదలు పెట్టారు. ‘ఆర్ ఆర్ ఆర్’ సంక్రాంతికి కూడ విడుదల కాకపోతే ఆ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ కు వాయిదా పడుతుందని దానితో అంతకాలం జూనియర్ కోసం త్రివిక్రమ్ వేచి ఉండలేక యాక్షన్ ప్లాన్ బిని ఆలోచిస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.   


దీనికితోడు త్రివిక్రమ్ కు అత్యంత సన్నిహితమైన సితారా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ త్రివిక్రమ్ సలహాతో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూవీ రీమేక్ హక్కులు తీసుకోవడంతో జూనియర్ గురించి ఎక్కువకాలం వేచి ఉండకుండా త్రివిక్రమ్ ఈ మూవీని ఈ గ్యాప్ లో పూర్తి చేస్తాడు అంటూ విపరీతంగా ఊహాగానాలు వచ్చాయి.

 

ఈ విషయాలు అన్నీ తారక్ దృష్టి వరకు వెళ్ళడంతో అలెర్ట్ అయిన జూనియర్ ఎట్టి పరిస్థితులలోను ‘ఆర్ ఆర్ ఆర్’ వాయిదా పడదని అనవసరపు ఆలోచనలు పెట్టుకోకుండా తన మూవీ స్క్రిప్ట్ విషయమై పూర్తి శ్రద్ధ పెట్టమని త్రివిక్రమ్ తో తాను చేయబోయే మూవీ అనుకున్న విధంగా ప్రారంభం అయి వచ్చే ఏడాది సమ్మర్ కు రావడం ఖాయం అంటూ తారక్ త్రివిక్రమ్ కు ధైర్యం చెప్పి అతడు మరొక సినిమా వైపు వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు వార్తలు హడావిడి చేస్తున్నాయి..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: