కరోనా ప్రపంచ వ్యాప్తంగా కలవరపెడుతోంది. దీంతో ఎవ్వరూ కూడా ఇంటి నుంచి బయటకు రాకుండా స్వియ నిర్బంధనలో ఉంటే చాలా మంచిది. అలాగే ఒక మనిషి నుంచి మరో మనిషికి ఎంత డిస్టెన్స్ మెయిన్టెయిన్ చేస్తే అంత మంచిది ఇవన్నీ పాటిస్తేనే మనం ఈ వ్యాధి బారిన పడకుండా ఈ వ్యాధి నుంచి మనల్ని మనం కాపాడుకోగలం అని ఒక పక్క ప్రభుత్వాలు మరో పక్క సోషల్ మీడియాలో మొత్తుకుంటున్నారు. మరి ఈ నేపధ్యంలోనే సెలబ్రెటీ నుంచి సామాన్యుల వరకూ ప్రతి ఒక్కరూ కూడా లాక్డవున్లో ఉంటున్నారు. మరి ఇంట కఠినంగా ఉంటున్నప్పుడు సెలబ్రెటీలు మాత్రం ఏంచేయాలో తోచక వాళ్ళు రోజూ చేసే కొన్ని యాక్టివిటీస్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యోక్తుల్ని చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే మరి కొందరు ఏమి చెయ్యాలో తెలియక ఎప్పటివో ఫొటోస్ని షేక్ చేస్తూ చిక్కుల్లో పడుతున్నారు. మరి అలాంటి సంఘటనే ఒకటి పాయల్ రాజ్పుత్కి ఎదురయింది.
సినిమా థియేటర్లు, షూటింగ్లు సైతం నిలిచిపోవడంతో చిత్ర పరిశ్రమ కూడా పెద్ద సమస్యనే ఎదురుకుంటుంది. అయితే సినీ కార్మికులను ఆదుకునేందుకు చిత్ర పరిశ్రమలోని చాలా మంది నటులు తమ వంతు సహాయంగా కొంత విరాళాన్ని ప్రకటిస్తున్నారు. మరి అలాంటి సమయాల్లో హీరోయిన్లు మాత్రం ఎవ్వరూ ముందుకు రావడం లేదని ఓ పక్క విమర్శల వర్షం కురుస్తుంటే... ఇలాంటి సమయంలో ఫొటోలను షేర్ చేసి కోరి తెచ్చుకుంది తిప్పలు అన్నట్లు ఉంది ఈ పాయల్ పని.
హీరోయిన్ పాయల్ రాజ్పూత్ లాక్డౌన్ని పక్కన పెట్టి ఓ పార్కులో ఫోటో షూట్ చేసుకోవడంతో నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. అయితే ఇంట్లో ఉండండి అని ప్రభుత్వాలు ఎంత చెప్పినా వినకుండా లాక్ డౌన్ టైంలో పార్కుల్లో తిరుగుతూ ఫొటోలకు పోజులు కొడతావా? బాధ్యత లేదా అంటూ పాయల్పై నెటిజన్స్ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై స్పందించిన పాయల్ అవి ఇప్పటి ఫోటోలు కావని, ఆహ్లాదకరమైన వాతావరణం అంటే తనకు ఇష్టం అని, ఆ రోజుల్ని మిస్ అయ్యా అంటూ మరో పోస్ట్ చేసి నెటిజన్లకు క్లారిటీ ఇచ్చింది. మొత్తానికి మంచి ఫొటోలు పెట్టకుండా ఎందుకొచ్చిన గోల నీకిది పాయల్.