నేను శైలజ చిత్రంలో హీరోయిన్ గా కనిపించిన కీర్తి సురేష్ నేను లోకల్ సినిమాతో తెలుగు వాళ్లకి మరింత దగ్గరైంది. నాని హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అయితే ఆ తర్వాత మహానటి సావిత్రి జీవిత కథలో నటించిన ఆమెకి బ్లాక్ బస్టర్ పడింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ ని సాధించింది. అంతేకాదు ఈ సినిమాలో కీర్తి నటనకి జాతీయ ఉత్తమనటిగా అవార్డు కూడా గెలుచుకుంది.

 

 

 

మహానటి తర్వాత కీర్తి తెలుగు సినిమాల్లో కనిపించలేదు. భారీ సక్సెస్ వచ్చినప్పటికీ ఆమె తెలుగు సినిమాల్లో కనిపించకపోవడం విచిత్రమే. అయితే ప్రస్తుతం ఆమె మిస్ ఇండియా అనే లేడీ ఓరియంటెడ్ చిత్రంలో నటిస్తుంది. ఇంకా రెండు మూడు లేడీ ఓరియంటెడ్ సినిమాలు లైన్లో ఉన్నాయని సమాచారం. అయితే తెలుగులో ఆమె నితిన్ సరసన రంగ్ దే చిత్రంలో కనిపించనుంది.

 

 

 

ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఇటీవలే రిలీజైంది. ఈ ఫస్ట్ లుక్ చాలా ఇంటెన్స్ గా ఉండి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. అయితే గత కొన్ని రోజులుగా కీర్తి సురేష్ పెళ్ళిపై అనేక వార్తలు వస్తున్నాయి. ఆమెకి త్వరలో పెళ్ళి జరగబోతుందని, కేరళలోని ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడితో ఆమె పెళ్ళి ఉంటుందని, ఈ విషయంలో రెండూ ఫ్యామిలీలు ఓకే అనుకున్నారని వార్తలు వచ్చాయి.

 

 

 

అయితే ఈ వార్తలని కీర్తి సురేష్ ఫ్యామిలీ ఖండించింది. కీర్తి పెళ్ళి వార్తల్లో నిజం లేదని, ఇప్పుడప్పుడే కీర్తికి పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యం లేదని, ఆమె ఓకే చెప్పిన తర్వాత మేమే చూస్తామని అప్పటి వరకు ఇలాంటి పుకార్లని నమ్మవద్దని కోరారు. మొత్తానికి కీర్తి ఇప్పుడే పెళ్ళి చేసుకోవట్లేదని తెలిసిపోయింది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: