టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ రేంజ్ లో ఉన్న హీరోయిన్లలో పూజా హేగ్డే ముందు వరుసలో ఉంటుంది. బాలీవుడ్ కంటే టాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న పూజా అగ్ర హీరోలతో సినిమాలు చేస్తోంది. కెరీర్ పీక్స్ ఉన్న అమ్మడు టాలీవుడ్ పైనే దృష్టి పెడుతోంది. తమిళ్ నుంచి అవకాశాలు వస్తున్నా కాదంటోంది. టాలీవుడ్ లో ఆమెకున్న క్రేజ్, ప్రాజెక్ట్స్ అలాంటివి మరి. రీసెంట్ అల.. వైకుంఠపురములో సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చిన పూజాపై ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ రూమర్ నడుస్తోంది.

 

 

బాలీవుడ్ హీరో రోహన్ మోహ్రాతో అమ్మడు డేటింగ్ లో ఉందని ఓ గాసిప్ బాగా రౌండ్ అవుతోంది. గతంలో కూడా వీరిద్దరు లవ్ ఉన్నారని రూమర్స్ వచ్చినా పూజా కొట్టిపారేసింది. మేమిద్దరం ఫ్రెండ్స్ అని బాలీవుడ్ మీడియాకు చెప్పింది కూడా. కానీ.. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరగడం మరింత ఎక్కువైందని బాలీవుడ్ సమాచారం. ఆమధ్య వీరిద్దరూ కలిసి ముంబై లోని బాంద్రాలో కలిసి తిరిగిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఆ ఫొటోల్లో వైట్ స్కర్ట్ లో పూజా అందంగా మెరిసిపోతోంది. వీరిద్దరూ కలిసి ఒకే కారులో వచ్చిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని బాలీవుడ్ మీడియా సైతం అంటోంది.

 

 

సైఫ్ ఆలీ ఖాన్ హీరోగా వచ్చిన బజార్ సినిమాతో రోహన్ సినీ ఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు పూజా హెగ్దే తెలుగులో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. ప్రభాస్, అఖిల్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా తమిళ్ లో సూర్య సినిమాలో హీరోయిన్ గా పూజాను తీసుకున్నారని వార్తలు వచ్చాయి. వీటిని కొట్టిపారేసింది పూజా. ఈ వార్తల్లో నిజమెంతుందో పూజా పాపే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

 

  

 

  

మరింత సమాచారం తెలుసుకోండి: