రష్మిక మందన ఇపుడు టాలీవుడ్లో దూసుకుపోతున్న హీరోయిన్. స్టార్ ఇమేజ్ కోసం చేయని ప్రయత్నం లేదు. పైగా టాప్ హీరోల పక్కనే యాక్ట్ చేస్తానటూ ఒక గట్టి కండిషన్ కూడా పెట్టుకుంది. అటువంటి రష్మికని ఓ టాప్ హీరో  పూర్తిగా పక్కన పెట్టారని టాక్ నడుస్తోంది.

 

అది నిజమా కాదా అన్నది పక్కన పెడితే ముందు ఆ వార్త మాత్రం ఇంటెరెస్టింగ్ గా ఓ గాసిప్ గా మారిపోయింది. టాప్ హీరో మహేష్ బాబు రష్మిక జంటగా సరిలేరు నీకెవ్వరూ మూవీ చేశారు. ఈ ఏడాది అది సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ మూవీలో మహేష్ పక్కన రష్మిక జంట కుదరలేదు అన్న న్యూస్ మాత్రం ఎక్కడ చూసినా వినిపించింది.

 

మహేష్ ఆరడుగుల పొడవైన హీరో. ఆయన పక్కన రష్మిక తేలిపోయిందని, పైగా ఇద్దరి కెమిస్ట్రీ పండలేదని కూడా క్రిటిక్స్ హాట్ కామెంట్స్ చేశారు. ఆ సంగతి అలా ఉంటే మహేష్ బాబు ఇపుడు గీతా గోవిందం డైరెక్టర్ పరశురామ్ తో మూవీ చేస్తాడని అంటున్నారు. పరశురామ్ గీత రష్మికే కాబట్టి ఆమెను ఈ సినిమాలో కంటిన్యూ చేయాలనుకున్నాడట.

 

అయితే దానికి మహెష్ నో చెప్పేశాడని అంటున్నారు. ఆమెతో చేశాను కదా వేరే వాళ్ళను చూడు అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి భిన్నమైన‌ న్యూస్ కూడా ఉంది. మహేష్ బాబు పరశు రామ్  మూవీకి ఇంకా స్టోరీయే ఫైనల్ కాలేదని, ఇంతలో హీరోయిన్ గోల ఏంటని అంటున్నారు. ముందు స్టోరీని పూర్తిగా రాసుకోమని, అందుకోసం కావాల్సినంత టైం తీసుకోమని కూడా మహేష్ అన్నట్లుగా టాక్ ఉంది.

 

ఇపుడు ఎలాగూ కరోనా వైరస్ తో షూటింగులకు  వెకేషన్స్ ఇచ్చేశారు కాబట్టి తాపీగా స్క్రిప్ట్ మీద కూర్చోమన్నాడుట. అది పూర్తి అయితే అపుడు రష్మికనా, మరో బాలీవుడ్ హీరోయినా అన్నది తేలుతుందని అంటున్నారు. ఏది ఏమైనా మహేష్ రష్మిక కాంబో రిపీట్ అవుతుందా అవదా అన్నది కొంతకాలం ఆగితే కానీ తెలియదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: