కన్నడ స్టార్ హీరో యశ్ కేజీఎఫ్ సినిమా తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. బాహుబలి ఫ్రాంఛైజీ సినిమాతో టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కి ఎంతగా క్రే వచ్చిందో అంత క్రేజ్ యశ్ కి రావడం విశేషం. నిజంగా యశ్ కి ఈ రేంజ్ క్రేజ్ వస్తుందని ఏ ఒక్కరు ఊహించలేదు. భారీ కలెక్షన్స్ ని సాధించి ఇండస్ట్రీ రికార్డ్స్ ని క్రియోట్ చేసింది. 2018 డిసెంబర్ లో విడుదలైన కేజీఎఫ్ సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి సంచలనం సృష్టించి కన్నడ సినిమా ఇండస్ట్రీకి భారీ క్రేజ్ తేవడమే కాదు మార్కెట్ పరంగా రికార్డ్ ని నెలకొల్పింది.

 

ఇక ఈ సినిమా రిలీజైన అన్నీ బాషలలో బ్లాక్ బస్టర్ గా నిలిచి అందరి హీరోలకి డైరెక్టర్ మీద క్యూరియాసిటి ని పెంచేసింది. ఈ క్రేజ్ చూసిన మేకర్స్ మళ్ళీ కేజీఎఫ్ కి కొనసాగింపుగా కేజీఎఫ్ చాప్టర్ 2 నిర్మించాలని సన్నాహాలు చేశారు. దాదాపు రెండు సంవత్సరాలుగా ప్రేక్షకులులు హీరో యశ్ కేజీఎఫ్2 లో ఏం చేయబోతున్నాడో.. ఎలా కేజీఎఫ్ కి డాన్ అయ్యాడో అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఇక షూటింగ్ పార్ట్ పూర్తయిపోయిన ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 23న విడుదల చేస్తామని చిత్రయూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్ 2 గురించి కొన్ని షాకింగ్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

కేజీఎఫ్ 2లో సంజయ్ దత్ అధీరా అన్న విలన్ పాత్ర లో నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ దేశ ప్రధాని పాత్రలో కనిపించనుందట. రవీనా పాత్ర నెగటివ్ షేడ్స్ తో ఉంటుందని అంటున్నారు. విలన్స్ అందరినీ అంతమొందించిన తర్వాత రాఖీభాయ్ కేజీఎఫ్ కింగ్ అవుతాడని మరో న్యూస్ కూడా బయటకి వచ్చింది. అలా ఎదిగిన రాఖీభాయ్ ని ప్రధాన మంత్రి రాజకీయ కుట్రల తో చంపిస్తుందని ఇదే సినిమాలో హైలెట్ కాబోతుందని తాజా సమాచారం.

 

అలాగే తల్లి మాట కోసం రాఖీభాయ్ గొప్ప రాజుగా ఎదుగుతాడని అది చూసి తల్లి చాలా గర్వంగా ఫీలవుందని అది కూడా సెంటిమెంట్ పరంగా బాగా వర్కౌట్ అవుతుందని చెప్పుకుంటున్నారు. మరి కేజీఎఫ్2 లో హీరోయిజం మాములుగా ఉండదని మాత్రం ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. అయితే ఇలాంటి విషయాలన్ని బయట పడ్డాక సినిమా మీద ఆసక్తి తగ్గుతుందా అన టాక్ కూడా వస్తుంది. అదీ కాకా వసూళ్ళ పరంగా ఇప్పుడు దెబ్బ పడే అవకాశం ఉందని మాట్లాడుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: