ప్రస్తుతం మన టాలీవుడ్ మేకర్స్ బాలీవుడ్ బ్యూటిస్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ తో బాలీవుడ్ బ్యూటి ఆలియా భట్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక్క అప్పుడప్పుడు బాలీవుడ్ ఐటం భామలు టాలీవుడ్ లో ఐటం సాంగస్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసందే. మొన్న ఆమధ్య ప్రభాస్ సాహో సినిమాలోను బాలీవుడ్ హీరోయిన్స్ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించగా, జాక్వెలిన్ ఫెర్నాండస్ ఐటం సాంగ్ లో మెరిసింది. ఇప్పుడు అలాగే మరో బాలీవుడ్ హీరోయిన్ టాలీవుడ్ కి రాబోతుందని తాజా సమాచారం. 

 

గోపీచంద్ హీరోగా ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో కొత్త సినిమా రూపొందుతున్న సంగతి తెలిసందే. వీరిద్దరి కాంబినేషన్ లో ఇంతకుముందు 'గౌతమ్ నంద' అనే సినిమా రూపొందింది. ఆ సినిమా మంచి టాక్ సొంతం చేసుకున్నప్పటికీ వసూళ్ళ పరంగా మాత్రం నిర్మాతలకి నిరాశని మిగిల్చింది. ఆ తర్వాత డైరెక్టర్ సంపత్ నంది నుండి ఏ సినిమా రాలేదు. చాలా గ్యాప్ తీసుకొని ఒక మంచి స్పోర్ట్స్ బ్యాగ్డ్రాప్ లో గోపీచంద్ హీరోగా రెండో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు 'సీటిమార్' అనే టైటిల్ ఫిక్స్ చేసారు చిత్ర బృందం. ఇక ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఈ సినిమాలో గోపీచంద్ - తమన్నాలు కబడ్డీ కోచ్ లుగా నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. 

 

ఇక ఈ సినిమా దాదాపు 60% షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ప్రస్తుతం కరోనా వ్యాప్తి కారణంగా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు యూనిట్. ఇక సంపత్ నంది గత సినిమాల మాదిరిగానే సీటిమార్ లో కూడా ఐటమ్ సాంగ్ ని తెరకెక్కించబోతున్నారట. ఈ ఐటమ్ సాంగ్ లో బాలీవుడ్ హాట్ బ్యూటి 'ఊర్వశి రౌతేలా' ఆడి పాడనుందని లేటెస్ట్ న్యూస్. గ్రాండ్ మస్తీ - కాబిల్ - హేట్ స్టోరీలలో ఊర్వశీ గ్లామర్ తో హీటెక్కించింది. బాలీవుడ్ లో మంచి హాటెస్ట్ గర్ల్ గా పాపులర్ అయిన ఊర్వశికి సౌత్ ఇండస్ట్రీలో అదీ తెలుగులో ఫస్ట్ టైం ఇలా ఎంట్రీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. లాక్ డౌన్ ముగిసిన వెంటనే ఐటమ్ సాంగ్ షూట్ చేస్తారని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: