సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ కాంపౌండ్ నుంచి వచ్చిన దర్శకులందరు టాలీవుడ్ టాప్ పొజిషన్ లో ఉన్నారు. పూరి జగన్నాధ్, హరీష్ శంకర్, కృష్ణవంశీ అందుకు ఉదాహరణ. ఇపుడు ఆ లిస్ట్ లో చేరిన దర్శకుడే అజయ్ భూపతి. ఆర్ఎక్స్ 100 సినిమా తో సూపర్ హిట్ ని అందుకున్నాడు ఈ దర్శకుడు. రాం గోపాల్ వర్మ శిష్యుడిగా ఇండస్ట్రీకొచ్చిన అజయ్ భూపతి మొదటి సినిమా అయిన ఆర్ఎక్స్ 100 కోసం మాత్రం చాలా శ్రమించాడు. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని పెళ్ళి ని కూడా కాదనుకొని కేవలం సినిమా కోసమే తపనపడ్డాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఆర్ఎక్స్ 100 టాలీవుడ్ లో సూపర్ హిట్ ని సాధించింది. 

 

ఈ సినిమాతో హీరో కార్తికేయ, హీరోయిన్ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఇండస్ట్రీలో వరసగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే కార్తికేయ హీరోగా రెండు సినిమాలు, విలన్ గా ఒక సినిమా చేసేశాడు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ లో ఒక సినిమా చేస్తున్నాడు. అలాగే హీరోయిన్ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఆర్ఎక్స్ 100 తర్వాత హీరోయిన్ గా ఆర్.డి.ఎక్స్ లవ్, విక్టరీ వెంకటేష్ తో వెంకీ మామ, మాస్ మహారాజా రవితేజ తో డిస్కో రాజా సినిమాలు చేసింది. ప్రస్తుతం మరో సినిమా పాయల్ చేతిలో ఉంది. కాని దర్శకుడు అజయ్ భూపతి కి మాత్రం మళ్ళీ సినిమా రాకపోవడం ఆశ్చర్యకరం. 

 

వాస్తవంగా ఆర్.ఎక్స్ 100 తర్వాత వెంటనే సినిమాని అనౌన్స్ చేశాడు. అయితే అప్పటి నుంచి ఈ సినిమాకి హీరోలు మారారు. వరుసగా నిర్మాతలు మారారు. కాని అజయ్ భూపతి అనౌన్స్ మహా సముద్రం మాత్రం అంగుళం కదలలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మహా సముద్రం ఇలా డిలే అవడానికి కారణం ఆర్.ఎక్స్ 100 మాదిరిగా బోల్డ్ కంటెంట్ తో సాగుతుందట. అందుకే ముందు చేద్దామని చెప్పిన హీరోలు తర్వాత డ్రాపవుతున్నారట. అయితే ప్రస్తుతం ఈ సినిమాని నిర్మించడానికి అనిల్ సుంకర ముందుకు వచ్చినట్టు తాజా సమాచారం. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న శర్వానంద్ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడట. మరి ఈ సారైనా సినిమా సెట్స్ మీదకి వెళుతుందో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: