ప్రస్తుతం అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'. వరుసగా మూడు ఫ్లాప్స్ తర్వాత అఖిల్ చాలా ఆశలు పెట్టుకొని నటిస్తున్న సినిమా. ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీవాసు, వాసు వర్మలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఆరెంజ్ సినిమా తో భారీ ఫ్లాప్ పడటం తో బొమ్మరిల్లు భాస్కర్ చాలా ఏళ్ళు సినిమా అవకాశాలు లేక అల్లాడిపోయాడు. అయితే ఎట్టకేలకి బాస్కర్ కి గీతా ఆర్ట్స్ అవకాశం ఇచ్చింది. దాంతో ఎలాగైనా ఈ సినిమాతో హిట్ కొట్టి మళ్ళీ ఫాం లోకి రావాలని తాపత్రయపడుతున్నాడు. అంతేకాదు అక్కినేని హీరోకి హిట్ ఇచ్చే బాధ్యత కూడా భాస్కర్ మీదే ఉంది.

 

ఇక ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందట. కొంత టాకీ పార్ట్ సాంగ్స్ బ్యాలెన్స్ ఉందట. పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ చేశారు చిత్ర యూనిట్. సరిగ్గా ఇదే సమయంలో కరోనా దెబ్బతో చేయాల్సిన షూటింగ్ నిలిపేశారు. ఇది ఒకరకంగా చిత్ర యూనిట్ కంటే కూడా ఎక్కువ ప్రభావం దర్శకుడు భాస్కర్ హీరో అఖిల్ మీద పడిందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో ఈ బ్యూటి అఖిల్ అన్న నాగ చైతన్య సరసన ఒక లైలా కోసం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా మంచి హిట్ గా నిలిచింది. 

 

ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్ళి మళ్ళీ తిరిగి టాలీవుడ్ కి వచ్చింది. అప్పటి నుంచి ఇక్కడ స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ బ్లాక్ బస్టర్స్ అందుకుంటూ పాపుల హీరోయిన్ గా క్రేజ్ ని సంపాదించుకుంది. ఈ ఇయర్ ప్రారంభంలోనే అల్లు అర్జున్ తో నటించిన అల వైకుంఠపురములో సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారింది. రెమ్యూనరేషన్ పరంగా కూడా ప్రస్తుతం పూజా టాప్ లో ఉంది. ఇక అఖిల్ తో నటిస్తున్న సినిమా పూజా సెట్ అవలేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇద్దరిని పక్క పక్కన చూస్తే ఏజ్ గ్యాప్ ఏదో అనిపిస్తుందన్న టాక్ బాగా వినిపిస్తుంది. మరి ఇది నిజంగా సినిమాకి మైనస్ అవుతుందా అన్నది ప్రేక్షకుల ముందుకు వచ్చాకే తెలుస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: