ఒక సూపర్ హిట్ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయిన అజయ్ భూపతి ఆరెక్స్ 100 సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు.  ఆ సినిమా తర్వాత ఆ డైరెక్టర్ రెండో సినిమా కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. స్క్రిప్ట్ ఓకే చేసిన హీరోలు బడ్జెట్ విషయం వచ్చే సరికి బెంబేలెత్తుతున్నారు. అందుకే కాంప్రమైజ్ కాకుండా అలాంటి బడ్జెట్ ఉన్న హీరో దొరికే వరకు వెయిట్ చేశాడు అజయ్ భూపతి. ఆరెక్స్ 100 సింపుల్ బడ్జెట్ లోనే పూర్తి చేశాడు. కాని రాబోయే సినిమా భారీ బడ్జెట్ కేటాయించాల్సిందే. 

 

ఫైనల్ గా శర్వానంద్ హీరోగా అజయ్ భూపతి డైరెక్షన్ లో సినిమా ఓకే అయ్యింది. జాను తర్వాత శ్రీకారం సినిమాతో రాబోతున్నాడు శర్వానంద్.. ఆ సినిమా తర్వాత అజయ్ భూపతి సినిమానే చేస్తాడని తెలుస్తుంది. సినిమాకు మహా సముద్రం అని టైటిల్ ఫిక్స్ చేశాడు. బడ్జెట్ కూడా 40 నుండి 50 కోట్ల దాకా పెడుతున్నారట. అలాంటి బడ్జెట్ కేటాయించే కథ కాబట్టే ఇన్నాళ్లు వెయిట్ వెయిట్ చేశాడు అజయ్ భూపతి. 

 

నాగ చైతన్య హీరోగా మహా సముద్రం దాదాపు ఓకే అయినట్టు వార్తలు వచ్చాయి. మరి ఎక్కడ తేడా జరిగిందో ఏమో కాని చైతు కూడా ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకోగా శర్వానంద్ లైన్ లోకి వచ్చాడు. చైతు హీరోగా నటిస్తాడని అనుకుని సమంత కు స్టోరీ చెప్పి ఆమెని హీరోయిన్ గా ఫిక్స్ చేశాడు. అయితే సినిమా చైతు నుండి శర్వా కు వచ్చింది కాబట్టి సమంత హీరోయిన్ గా చేయడం కూడా డౌటే అంటున్నారు. మొత్తానికి సగం ఇండస్ట్రీ తిరిగి వచ్చిన మహా సముద్రం కథ శర్వానంద్ చేతికి వచ్చింది. ఈ సినిమా హిట్ అయితే మాత్రం మిస్సైన హీరోలు అందరు బాధపడక తప్పదు. తన మీద నమ్మకం పెట్టని హీరోలకి హిట్టు కొట్టి సత్తా చూపించాలని ఫిక్స్ అయ్యాడు అజయ్ భూపతి.

మరింత సమాచారం తెలుసుకోండి: